Categories: TOP STORIES

కేపీహెచ్‌బీలో గజం.. 2.98 లక్షలు!

కేపీహెచ్బీ-హైటెక్ సిటీ ప్రధాన రహదారికి ఆనుకొని హౌజింగ్ బోర్డ్ కు చెందిన ఖాళీ స్థలాలను తెలంగాణ హౌజింగ్ బోర్డు వేలం వేయగా రికార్డు స్థాయిలో ధర పలికింది. ఈ కాలనీలో 18 ఇళ్ల స్థలాలకు నిర్వహించిన వేలంలో మొత్తం 87 మంది పాల్గొన్నారు. 198 గజాల నుంచి 987 గజాల‌ను వేలానికి పెట్టారు. సుమారు రూ.150 కోట్లు రూపాయల రాబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
మొత్తం 6,237 గజాలకు రూ. 141.36 కోట్ల రూపాయల ఆదాయం వ‌చ్చింది. ఈ స్థాయిలో ధరలు రావడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని హౌసింగ్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్య‌ధికంగా.. చ‌ద‌ర‌పు గ‌జానికి రూ.2.98 ల‌క్ష‌లు ప‌లికింది. అత్యల్పంగా 1.70 లక్షల ధర పలికింది. ఇది కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల నేప‌థ్యంలో నిర్వ‌హించిన వేలం పాట కాబ‌ట్టి.. కేపీహెచ్‌బీ చుట్టుప‌క్క‌లంత‌టా ఇదే రేటు వ‌ర్తించ‌ద‌ని గుర్తుంచుకోండి. ఇదే ధ‌ర ప్రామాణికం కాద‌ని గ‌మ‌నించాలి.

This website uses cookies.