Categories: LATEST UPDATES

హెచ్ఎండీఏ తొలి ప్రీ బిడ్ మీటింగ్ సక్సెస్

* రంగారెడ్డి జిల్లా పరిధిలో 13 ల్యాండ్ పార్సిల్స్

రంగారెడ్డి జిల్లా పరిధిలోని 13 ల్యాండ్ పార్సెల్ విక్రయానికి వీలుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) బుధవారం బేగంపేట్ టూరిజం ప్లాజా హోటల్లో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశం విజయవంతం అయింది. దాదాపు 100 మంది ఔత్సాహికులు, పలు రియాల్టీ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై ఆయా ప్రాంతాల ల్యాండ్ పార్సిల్స్ గురించి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు వారి సందేహాలు అనుమానాలను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ ప్రీ బిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ (ఈవో) గంగాధర్, హెచ్ఎండిఏ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీవో) గంగాధర్, రంగారెడ్డి జిల్లా ఆర్డీవో చంద్రకళతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టిసి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఎండిఎస్ సెక్రటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్ లు ల్యాండ్ పార్సెల్ ఉన్న ప్రాంతాలు వాటి ప్రాధాన్యత అంశాలను వివరించారు. ల్యాండ్ పార్సెల్ కొనుగోలుకు జనవరి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం ఉందని, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు 17న ధ‌రావతు (ఈఎండి) చెల్లించాలని, ధరావతు చెల్లించిన వారు ఈనెల 18న జరిగే ఈ వేలం ప్రక్రియలో పాల్గొని అవకాశం ఉంటుందని తెలిపారు.

This website uses cookies.