SHANTA SRIRAM CONSTRUCTIONS MD NARSIAH 30 YEARS REAL STORY
ఆఫీసులో పని చేసేటప్పుడు ఒక చిన్న గొడవ.. ఆయన జీవితాన్నే పూర్తిగా మార్చివేసింది. కష్టపడే మనస్తత్వం గల ఆయనకు సోదరుడు కూడా తోడు కావడంతో.. ఇంకేముంది.. ఇద్దరు అలుపెరగక కష్టపడ్డారు.. చిన్న చిన్న ప్రాజెక్టులతో ప్రస్థానాన్ని ఆరంభించి.. కస్టమర్ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉంటూ.. ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తూ.. 1995లో ఆరంభమైన ప్రయాణం.. ఎనభైకి పైగా ప్రాజెక్టులు పూర్తి.. పదివేలకు పైగా హ్యాపీ కస్టమర్లు.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే.. గొప్ప సంతోషం.. ఎక్కడ్లేని సంతృప్తి.. శాంతాశ్రీరాం కన్స్ట్రక్షన్స్ ఎండీ ఎం నర్సయ్యను ఇటీవల రియల్ ఎస్టేట్ గురు పలకరించింది. రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికరమైన అంశాల్ని పంచుకున్నాడు. మరి, ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం..
ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో నెలకు రూ.900 జీతంతో మొదలైన ఆయన కెరీర్.. ఐదేళ్లకే మలుపు తిరిగింది. జాబ్ మానేసి రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ప్రస్థానం ప్రారంభించారు. ఆ వెంటనే కన్ స్ట్రక్షన్ కంపెనీ స్థాపించి.. తొలుత రెండు ఇళ్లతో రియల్ జర్నీ మొదలుపెట్టారు. అంతే ఇక వెనుతిరిగి చూడలేదు. 30 ఏళ్లుగా ఆ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతోంది. వేల అపార్ట్ మెంట్లు.. 50 లక్షలకు పైగా చదరపు అడుగుల్లో కమర్షియల్ ప్రాజెక్టులు.. మల్టీ ప్లెక్స్ లు.. ఐటీ పార్కులు.. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు.. అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డారు. కస్టమర్ సంతృప్తే ధ్యేయంగా.. నిర్మాణంలో నాణ్యతే పరమావధిగా ఎన్నో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడమే కాకుండా తన కస్టమర్లందరినీ కుటుంబ సభ్యులుగా భావించి వారితో ప్రయాణం నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదీ శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్ ఎండీ నర్సయ్య సక్సెస్ స్టోరీ. రియల్ జర్నీ ప్రారంభించి 30 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి ఇటీవల అడుగుపెట్టారు.
తొలుత మెహదీపట్నం ఎల్ఐసీ కాలనీలో ఎనిమిది ఫ్లాట్లతో అపార్ట్ మెంట్ ను విజయవంతంగా పూర్తి చేశారు. అప్పుడు నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.400 కాగా, రూ.600 రేటుతో విక్రయించారు. ఇది పూర్తయిన తర్వాత మారేడుపల్లిలో 15 ఫ్లాట్లతో మరో ప్రాజెక్టు ప్రారంభించారు. ఇక అక్కడ నుంచి వెనుతిరిగి చూడలేదు. ఒక్క మారేడుపల్లిలోనే 13 వెంచర్లు పూర్తి చేశారు. నిర్మాణంలో నాణ్యత పాటించడం.. కస్టమర్ల సంతృప్తే ధ్యేయంగా పలు చర్యలు చేపట్టడం.. ముఖ్యంగా వారు ఫ్లాట్ బుక్ చేసుకున్నప్పటితో పోలిస్తే.. స్వాధీనం చేసే సమయానికి దాని విలువ కనీసం 50 శాతం పెరిగేలా చేయడం ద్వారా నమ్మకమైన బిల్డర్ గా పేరు సంపాదించుకున్నారు. పైగా కస్టమర్లు-బిల్డర్ అనే బంధం కాకుండా వారందరినీ తన కుటుంబ సభ్యులు మాదిరిగా చూసుకునేవారు.
తాజాగా మణికొండ, కిస్మత్ పూర్ లో విల్లా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ప్రస్తుతం బోధివృక్ష పేరుతో తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో ఓ అపార్ట్ మెంట్ ప్రాజెక్టు కడుతున్నారు. ఇందులో 800 ఫ్లాట్లు ఉండగా.. పచ్చదనం కోసం 800 చెట్లు కూడా నాటారు. 2026 డిసెంబర్ నాటికి దీనిని పూర్తి చేసి స్వాధీనం చేసే దిశగా ముందుకెళ్తున్నారు. ఇందులో ఫ్లాట్ల ధరలు రూ.కోటి నుంచి రూ.1.20 కోట్ల మధ్యలో ఉంటుంది. దాదాపు రెండు మూడు కోట్ల రూపాయల విలువ చేసే అపార్ట్ మెంట్లలో ఉండే లగ్జరీ సౌకర్యాలను తాము ఇందులో పొందుపరుస్తున్నామని నర్సయ్య చెప్పారు. అలాగే కల్పవృక్షలో ఫ్లాట్ల ధరలు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఉంటాయని.. ఇందులో కూడా రూ.కోటిన్నర విలువ చేసే అపార్ట్ మెంట్లలో ఉండే సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు 8వేలకు పైగా అపార్ట్ మెంట్లు.. 50 లక్షల చదరపు అడుగులకు పైగా కమర్షియల్ ప్రాజెక్టులను పూర్తిచేసిన శాంతా శ్రీరామ్ కన్ స్ట్రక్షన్స్.. పలు సందర్భాల్లో సవాళ్లు కూడా ఎదుర్కొంది.
2007-08లో ఓసారి, తెలంగాణ ఉద్యమ సమయంలో మరోసారి, కరోనా సమయంలో ఇంకోసారి ఇబ్బందులు పడింది. బిజినెస్ ఘోరంగా పడిపోయింది. అయినప్పటికీ, అనతికాలంలోనే తేరుకుని సమర్థవంతంగా నిలబడింది. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రీ సేల్స్ చేయకపోవడం.. అన్ని అనుమతులూ తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు లాంచ్ చేయడం.. కస్టమర్ల సంతృప్తే ధ్యేయంగా పనులు చేయడం వంటి అంశాలు ఈ కంపెనీని అప్రతిహాతంగా ముందుకు నడిపిస్తున్నాయి.
హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనడానికి ఇది మంచి సమయమని.. ప్రస్తుతం 10 నుంచి 15 శాతం మేర తక్కువ ధరలున్నాయని చెప్పిన ఆయన.. హైదరాబాద్ మార్కెట్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర మెట్రో సిటీలతో పోలిస్తే హైదరాబాద్ లోనే రియల్ ధరలు తక్కువనే విషయాన్ని ప్రస్తావించారు. రియల్ రంగంలో రీజనల్ రింగ్ రోడ్డు గేమ్ ఛేంజర్ కానుందని పేర్కొన్నారు. ఇక హైరైజ్ టవర్లలో అన్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ తో ఇబ్బందులు ఉంటాయని.. అలాంటి ప్రాజెక్టుల్లో ఎకరానికి 2.5 లక్షల చదరపు అడుగుల నుంచి 3 లక్షల చదరపు అడుగుల వరకు పరిమితి విధిస్తే బాగుంటుందని సూచించారు.
This website uses cookies.