- బయ్యర్ల మూడ్కి తగ్గట్టుగా బిల్డర్ల నిర్మాణాలు
- 40, 50, 60 అంటూ స్కే స్క్రేపర్ల నిర్మాణం
- భూకంపాన్ని తట్టుకుంటాయా?
కాళ్ల కింద భూమి కంపించింది. చూస్తుండగానే కళ్ల ముందు భారీ భవంతులు నిలువునా కుప్పకూలిపోయాయ్. ప్రకంపించిన భూమి- నిమిషాల వ్యవధిలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం మిగిల్చింది. రెండు దేశాలను వణికిపోయేలా చేసిన భూకంపం- ఆ విజువల్స్ చూసిన వారికి మ్యాన్ మేడ్ వండర్లా కనిపించే స్కై స్క్రేపర్లు ఎంత వరకు సేఫ్ అనే.. ఎన్నో భయాలు, ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తిస్తోంది. మయన్మార్- థాయ్లాండ్ తరహా భూకంపాలు హైదరాబాద్లో సంభవిస్తే పరిస్థితేంటి? ఇక్కడి భవనాలు తట్టుకోగలవా? మన బిల్డింగ్స్- స్కే స్క్రేపర్స్ ఎంత వరకూ స్ట్రాంగ్? బిల్డర్లు ఎన్బీసీ నిబంధనల్ని పాటిస్తూనే ఆకాశహర్మ్యాల్ని పూర్తి నాణ్యతతో కడుతున్నారా? మార్కెట్ మెరుగ్గా లేదని భవన నిర్మాణ సామగ్రి ఎంపికలో రాజీ పడుతున్నారా?
స్ట్రక్చర్ దెబ్బతిన్నది. ఇంకొన్ని అయితే నిర్మాణ దశలోనే పేక మేడల్లా కుప్ప కూలిపోయాయ్. స్ట్రక్చర్ పాడైపోయిన బిల్డింగ్లు వినియోగానికి పనికి వస్తాయా లేదా అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దెబ్బ తిన్న భవనాలని పరిశీలించాక పనికి రావని తేలితే వాటిని కూల్చేయాల్సిందే.
రెండోస్థానంలో ఉన్నాం
హైద్రాబాద్లో ఇప్పుడు ఎటు చూసినా హై రైజ్ బిల్డింగ్సే. స్కై స్క్రేపర్స్ నిర్మాణంలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాం. డెవలప్మెంట్ యాంగిల్లో ఇవన్నీ చెప్పుకోడానికి బానే ఉన్నా.. భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తే పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు సమాధానం దొరకాల్సిన ప్రశ్న. మరి హైద్రాబాద్లో ఉన్న భవనాలు ప్రకంపనల ధాటిని తట్టుకోగలవా..? అంటే ఇక్కడి నిర్మాణాలకు ఢోకా లేదంటున్నారు నిపుణులు. నగరంలోని అధిక శాతం ప్రాజెక్ట్లని ప్రమాదాలని తట్టుకునేలా నిర్మిస్తున్నారని.. స్ట్రక్చరల్ కోడ్స్, డిజైన్స్ను సిటీ ఎర్త్క్వేక్ ప్రొఫైల్ను అనుసరించి కఠినంగా పాటించారని.. అందువల్ల నగరంలో భవనాలు భద్రంగా ఉంటాయంటున్నారు. అలాగే పెద్ద డెవలపర్లు, బిల్డర్లు భూప్రకంపన జోన్కు అవసరమైన ప్రమాణాలకు మించి సేఫ్టీ స్టాండర్డ్స్ను పాటిస్తూ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని.. మున్సిపల్ అథార్టీస్ ఈ మోడల్స్ను కచ్చితంగా పరిశీలించి.. నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా..? లేదా కఠినంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. సాధారణంగా బహుళ అంతస్థుల భవనాల్ని భూకంపాలు తట్టుకునే విధంగానే నిర్మిస్తారు. ప్రకంపనల ధాటికి భూమి షేక్ అయినా కదలకుండా స్ట్రక్చర్ ఉండేలా జాగ్రత్తపడ్తారు బిల్డర్లు. అయితే అది ఒక పాయింట్ వరకే. రిక్టర్ స్కేల్పై ఏడు, ఎనిమిది పాయింట్లు దాటి తీవ్రస్థాయిలో భారీ భూకంపాలు వస్తే మాత్రం ఎలాంటి స్ట్రక్చర్ అయినా నిలబడటం మాత్రం కష్టమే అంటున్నారు ఎక్స్పర్ట్స్.
మనకు భయం లేదు
తెలంగాణకు భూకంపాల భయం లేదు. దక్కన్ పీఠభూమిలో సముద్రానికి ఎత్తులో ఉంది కాబట్టి భాగ్యనగర ప్రజలు కూడా నిర్భయంగా ఉండొచ్చంటున్నారు సైంటిస్ట్లు. అలాగని పూర్తిగా సేఫ్జోన్లో ఉన్నామని ధైర్యంగా కూడా ఉండలేని పరిస్థితి. జనాభా విస్పోటనం, భారీ ప్రాజెక్ట్లతో భూకంపాల ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందనే అభిప్రాయాలే ఇందుకు కారణం. పైగా భద్రతా విషయాల్ని పరిశీలించాల్సిన టౌన్ ప్లానింగ్, ఫైర్ సేఫ్టీ అధికారులు అవినీతిలో మునిగి తేలుతూ ఇష్టమొచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారనే ఆరోపణలున్నాయ్. అందుకే ఎన్బీసీ నిబంధనలు పాటిస్తున్నామని చెబుతున్నప్పటికీ.. బ్యాంకాక్లో హై రైజ్ బిల్డింగ్స్ షేక్ అయిన విజువల్స్ చూసి ఇక్కడి బయ్యర్లు తమ సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నారు.
-
- భూకంప జోన్లని మార్చనున్న కేంద్రం
- త్వరలో కొత్త లిస్ట్..!
- దేశంలో ప్రస్తుతం ఐదు భూకంప జోన్లు
- ఆరుకి పెరగనున్న జోన్ల సంఖ్య
- మరి తెలంగాణ ఏ జోన్లో ఉంది..?
- హైద్రాబాద్లో భూకంపం వచ్చే అవకాశాలున్నాయా..?
- వస్తే బహుళ అంతస్థుల భవనాలు తట్టుకోగలవా..?
- హైద్రాబాద్ బిల్డర్లు, డెవలపర్లు ఎన్బీసీని ఫాలో అవుతున్నారా..?
- నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనల ప్రకారమే ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నారా..?
త్వరలో ఆరు జోన్లు..
మన దేశంలో ప్రస్తుతం ఐదు భూకంప జోన్లు ఉండగా.. వాటి సంఖ్య త్వరలో ఆరుకి పెరగనుంది. 1962లో దేశంలో తొలిసారి ఐదు జోన్లను ఏర్పాటు చేసింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆ తర్వాత 1970, 1984ల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్- బీఐఎస్ కొన్ని మార్పులు చేసి జోన్ల పరిధిలోని ప్రాంతాలను మార్చింది. 2002లో ఐఎస్ 1893:2002 పేరుతో వాటిని అభివృద్ధి చేశారు. అయితే భూమి లోపలి ఫలకాల కదలికలో వేగం పెరుగుతూ ఎన్నో మార్పులు చేసుకుంటుండటంతో భూభౌతిక శాస్త్రవేత్తలు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్పర్ట్స్, భూకంపాల పరిశోధకులు, బీఐఎస్ అధికారులతో కొత్త జోన్ల ఏర్పాటుకు కేంద్రం ఓ కమిటీని వేసింది. వీరు ప్రస్తుతమున్న 5 జోన్లని ఆరుగా మార్చాలని నిర్ణయించారు.
- భవన పునాదిలో వేసే పిల్లర్ల ఎత్తు.. మిగిలిన భవనంలోనూ అదే ఎత్తులో ఉండాలి.
- బేస్మెంట్ ఎత్తుకు తగ్గట్టు మిగిలిన అంతస్థుల ఎత్తు ఉండాలి.
- భవనాల ఆకృతి ఒకే వరస క్రమంలో సాగాలి. అంటే అడుగు భాగంలో చిన్నగా ఉండటం.. పైకి వెళ్లే కొద్దీ పెద్దగా మారడం.. పై భాగంలో చిన్నగా ఉండి అడుగు భాగంలో పునాదులు వెడల్పుగా ఉండటం లాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి.
- భవనాల పిల్లర్లు పునాది నుంచి.. పై అంతస్థు వరకు ఉండాలి. మధ్యలో వంపు రాకూడదు.
- ఇప్పటికే నిర్మించిన భవనాలకు రెట్రో ఫిట్టింగ్ సాయంతో స్ట్రక్చర్లో స్వల్ప మార్పులు చేసి భూకంపాలు తట్టుకునేలా చేయొచ్చు. దీనికి సంబంధించి ట్రిపుల్ ఐటీ ప్రత్యేక టెక్నాలజీని సైతం డెవలప్ చేసింది. అయితే ఇలా 3 అంతస్థుల వరకు మాత్రమే చేసే అవకాశముంది.
- రెట్రో ఫిట్టింగ్లో భాగంగా ఇప్పటికే ఉన్న భవనాలకు మరమ్మత్తులు చేసి వాటి పటిష్ఠత, జీవితకాలాన్ని పెంచుతారు.
- ఈ విధానంలో భవనం లేదా ఇంటి గోడలకు పై భాగంలోని గోడలకు లోపలా- బయటా చుట్టూ సిమెంట్ తొలగిస్తారు.
- సిమెంట్ స్థానంలో మెష్ను అమర్చి మళ్లీ ప్లాస్టరింగ్ చేస్తారు. తలుపులు, కిటికీలకు కూడా ఇదే విధానం అనుసరిస్తారు.
- ఈ మెష్ ప్లాస్టరింగ్ వల్ల భూకంపాలు వచ్చినప్పుడు భవన గోడల్లో కదలికలు తగ్గి భవనం కూలిపోకుండా ఉంటుంది.
- ఇళ్లకు రెట్రో ఫిట్టింగ్ చేయాలంటే నిర్మాణ వ్యయంలో 30 శాతం వెచ్చిస్తే సరిపోతుంది.