Categories: Celebrity Homes

రెండు ఫ్లాట్లు లీజుకు తీసుకున్న సచిన్ కంపెనీ

ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి టెండూల్కర్ కు చెందిన ఎస్ఆర్టీ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీ ముంబై బాంద్రా సబర్బ్ లోని మౌంట్ మారీ రోడ్డులో రెండు అపార్ట్ మెంట్లను లీజుకు తీసుకుంది. రహేజా బే ప్రాజెక్టులోని ఐదో అంతస్తులో ఉన్న రెండు ప్లాట్ల విస్తీర్ణం 3,358 చదరపు అడుగులు. ఫెరానీ డెవలపర్స్ నుంచి నేరుగా సచిన్ కంపెనీ దీనిని లీజుకు తీసుకుంది. నెలకు రూ.10.83 లక్షల అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. లీజు ఒప్పందం ఎప్పటివరకు ఉందో తెలియదు. లీజు ఒప్పందం ఈనెల 7న జరిగింది.

This website uses cookies.