poulomi avante poulomi avante

సెకండ్‌ హోమ్స్‌.. ఫుల్ డిమాండ్‌

  • హెచ్‌ఎన్‌ఐ, మిలీనియల్స్, ఎన్నారైల ఆసక్తి
  • సెకండ్‌ హోమ్స్‌ in Hyderabad గూగుల్లో వెదికేస్తున్నారు..
  • 300 కి.మీ. దూరమైనా సరే గ్రీనరీ, ఓపెన్‌ స్పేస్‌ ప్రాపర్టీలు
  • ఢిల్లీలో రూ. 10
  • 100 కోట్ల ఫామ్‌హౌస్‌లకు డిమాండ్‌
  • ముంబైలో రూ. 5 – 20 కోట్ల స్థలాల కొనుగోళ్లు
  • ఊటీ, మైసూర్, సిమ్లా, పర్వాను, కసౌలి వంటి ప్రాంతాలకు గిరాకీ
  • ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు సంపన్న వర్గాలే కస్టమర్లు
  • హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల అయినా సరే..

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం అనివార్యమైంది. కరోనా వచ్చాక ఒకే ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండటం సమస్యే. ఒకవైపు కరోనా చేతికి చిక్కకుండా.. మరోవైపు వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసుకునేందుకు వీలుగా ఉండేందుకు సెకండ్‌ హోమ్స్‌ ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నగరాల నుంచి దూరంగా ఉండాలన్న లక్ష్యంతో భద్రత, ప్రశాంతమైన ప్రాంతాలలో నివాసం ఉండేందుకు సంపన్న వర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, పచ్చని పర్యావరణంతో ఓపెన్‌ స్పేస్‌ ఎక్కువగా ప్రాంతాలలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు.

ఎవరు కొంటున్నారంటే?

ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు చెందిన ప్రవాసులు, హైనెట్‌ వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), సంపన్న భారతీయులు ఎక్కువగా సెకండ్‌ హోమ్స్‌ను కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌ తర్వాత సెకండ్‌ హోమ్స్‌ కోసం ఎంక్వయిరీలు 20–40 శాతం, లావాదేవీలు 15–20 శాతం మేర వృద్ధి చెందాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ జేఎల్‌ఎల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ రితేష్‌ మిశ్రా తెలిపారు. కొన్ని సంపన్న వర్గాలు నగరంలో 40 కి.మీ. పరిధిలో సెకండ్‌ హోమ్స్‌ కోసం ఎంక్వయిరీలు చేస్తుంటే.. మరికొందరేమో 300 కి.మీ. దూరం అయినా సరే గ్రీనరీ, ఓపెన్‌ స్పేస్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని తెలిపారు.

ఎక్కడ కొంటున్నారంటే?

ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సెకండ్‌ హోమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసుకునేందుకు వీలుగా వై–ఫై కనెక్టివిటీ, మెరుగైన రవాణా సేవలు ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని నాశిక్, కర్నాటకలోని మైసూరు, మంగళూరు, తమిళనాడులోని ఊటి, కేరళలోని కొచ్చి, హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లా, కసౌలి, పర్వాను, పుదుచ్చేరి ప్రాంతాలలో సెకండ్‌ హోమ్స్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిందని అడ్వైజరీ సర్వీసెస్‌ కొల్లియర్స్‌ ఇండియా ఎండీ శుభంకర్‌ మిత్రా తెలిపారు.

దుబాయ్, యూఈఏలోనూ..

మిలీనియల్స్‌ కస్టమర్లేమో ముంబై నుంచి 300 కి.మీ. దూరంలో ఉన్న నాసిక్, కర్జాత్, డియోలాలి, పన్వేల్‌ సరిహద్దులలో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీలు, ప్రీ–కోవిడ్‌తో పోలిస్తే ధరలు పెద్దగా పెరగని ప్రాజెక్ట్‌లలో కొనుగోలు చేస్తున్నారు. చెన్నైలో మహాబలిపురం, కేరళలోని కోవలం మెయిన్‌ రోడ్‌లో ఫామ్‌హౌస్‌లకు డిమాండ్‌ ఉంది. గోవాలోని పలు బీచ్‌ ప్రదేశాలు కూడా హెచ్‌ఎన్‌ఐ ఆసక్తి ప్రదేశాలలో ఒకటిగా ఉన్నాయి. కొంతమంది సంపన్న వర్గాలు దుబాయ్‌లోనూ సెకండ్‌ హోమ్స్‌ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సులువైన విమాన ప్రయాణం ఒక కారణమైతే.. ఆ దేశంలో కోవిడ్‌ నియంత్రణ మెరుగ్గా ఉండటం మరొక కారణమని తెలిపారు. కరోనా కంటే ముందుతో పోలిస్తే దుబాయ్‌లో సెకండ్‌ హోమ్స్‌ డిమాండ్‌ 15–20 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. దుబాయ్‌లో రూ.1–1.50 కోట్ల ధరల ప్రాపర్టీలకు యమా క్రేజీ చూపిస్తున్నారని పేర్కొన్నారు. యూఈఏలోని రెడీ–టు–మూవ్‌ ప్రాపర్టీలకు హెచ్‌ఎన్‌ ఆసక్తి చూపిస్తుండంటతో అక్కడ రీసెల్‌ ప్రాపర్టీలకు గిరాకీ తిరిగి పుంజుకుందని చెప్పారు.

రూ.100 కోట్ల ఫామ్‌హౌస్‌లు..

ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్, బెంగళూరు నగరాలలో సెకండ్‌ హోమ్స్‌ వృద్ధి 30–40 శాతం వరకుందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. ఢిల్లీలోని చత్తర్‌పూర్, సుల్తాన్‌పూర్‌లలో రూ.10–100 కోట్ల ఫామ్‌ హౌస్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిందని పేర్కొన్నారు. కరోనా కంటే ముందు నెలకు 2–3 ఫామ్‌హౌస్‌ డీల్స్‌ జరుగుతుండగా.. ప్రస్తుతం ఇది 10–12 డీల్స్‌కు పెరిగాయని తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత ఈ డిమాండ్‌ మరింత వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. లగ్జరీ గృహ కొనుగోలుదారులు మంచి డీల్స్‌ కోసం ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారని చెప్పారు.

లగ్జరీ స్థలాలు, అపార్ట్‌మెంట్లు..

ముంబైలో సెకండ్‌ హోమ్స్‌ కొనుగోలుదారులు రెండు రకాలుగా ఉన్నారు. హెచ్‌ఎన్‌ఐ కస్టమర్లేమో… రూ.5–20 కోట్ల మధ్య ధరలు ఉండే స్థలాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా ల్యాండ్‌లో ప్రాపర్టీ నిర్మాణ డిజైన్స్‌ను వాళ్లే సొంతంగా చేయాలని భావిస్తున్నారు. ఇక, మిలీనియల్స్‌ కొనుగోలుదారులమో.. చిన్న సైజ్, రో హౌస్‌ అపార్ట్‌మెంట్ల కోసం అన్వేషిస్తున్నారు. రూ.1–5 కోట్ల ధరలు ఉండే ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్‌లలో వర్క్‌ ఫ్రం హోమ్‌ చేసుకునేందుకు వీలుగా వేగవంతమైన వై–ఫై కనెక్టివిటీ, పని ప్రదేశాలకు వెళ్లేందుకు మెరుగైన రవాణా, ఇతరత్రా మౌలిక వసతులు ఉండాలని కోరుకుంటున్నారు. ముంబైకి చెందిన హెచ్‌ఎన్‌ఐల డిమాండ్‌ కారణంగా లోనావాలా, ఖండాలా, అలీబాగ్‌ ప్రాంతాలలో స్థలాల ధరలు 8–10 శాతం మేర పెరిగాయి. ముంబైలోని ఆంబే వ్యాలీలోని రూ.200 కోట్ల సెకండ్‌ హోమ్‌ లావాదేవీ జరిగిందని అనూజ్‌ పూరీ తెలిపారు.

సెకండ్‌ హోమ్స్‌ హైదరాబాద్లో కావాలా?

మెరుగైన రోడ్డు సౌకర్యం.. నిరాటంక విద్యుత్తు సరఫరా.. ప్రశాంతమైన వాతావరణం.. ఇంటర్నెట్ సౌకర్యం వంటివి ఉంటే.. హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరమైనా వెళ్లి ప్రశాంతంగా నివసించాలని కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా, గత పదేళ్ల నుంచి హైదరాబాద్లో అపార్టుమెంట్లలో నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు.. కరోనా నేపథ్యంలో దూరంగా వెళ్లాలని ప్రణాళికలు రచిస్తున్నారు. కాకపోతే, ఇంటి బడ్జెట్ రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలు ఉండాలని ఆశిస్తున్నారు. పావు ఎకరం స్థలంలో చిన్న ఇల్లు.. అక్కడే కూరగాయలు పండించుకుని.. వంట వండుకోవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వారికోసం హైదరాబాద్లో సరికొత్త ప్రాజెక్టులు ఆరంభమవుతున్నాయి. ఒకవేళ, మీకు ఇలాంటి ఇళ్లను కొనాలనే ఆసక్తి ఉంటే.. regnews21@gmail.comకి మెయిల్ చేయండి. మీకు ఎన్ని గజాల్లో ఇల్లు ఉండాలి? ఏ రకమైన వాతావరణం కోరుకుంటున్నారు? ఎలాంటి సదుపాయాల్ని ఆశిస్తున్నారు? బడ్జెట్ ఎంత? హైదరాబాద్లో ఎటువైపు ఉంటే బెటరని భావిస్తున్నారో వివరించండి. మీకు బెస్ట్ ప్రాజెక్టుల్ని మేం సజెస్ట్ చేస్తాం.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles