Categories: LATEST UPDATES

టిడ్కో లబ్ధిదారుల పేర్లపైనే కరెంటు మీటర్లు

  • అధికారులకు జీవీఎంసీ కమిషనర్ ఆదేశం

టిడ్కో లబ్ధిదారుల పేర్లపైనే ఎలక్ట్రిసిటీ మీటర్లు ఏర్పాటు చేయాలని గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి లక్ష్మయ్య అధికారులను ఆదేశించారు. ఆయన వైజాగ్ లోని సీహార్స్ జంక్షన్, చిలకపేటలోని టిడ్కో ఇళ్లను పరిశీలించారు. చిలకపేటలో 37 మంది లబ్ధిదారులకు, సీహార్స్ జంక్షన్ లో 25 మంది లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన వారికి కూడా బ్యాంకు రుణాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం అధికారులకు సూచించారు. అలాగే లబ్ధిదారుల పేర్లపైనే ఎలక్ట్రిసిటీ మీటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

This website uses cookies.