Categories: LATEST UPDATES

50 ఏజెన్సీలతో ఫైర్ ఆడిట్

తెలంగాణ అగ్నిమాపక శాఖ నిర్ణయం

హైదరాబాద్ గుల్జార్ హౌస్ ప్రమాదంతోపాటు ఇటీవల పలుచోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం 50 థర్ట్ పార్టీ ఏజెన్సీలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే ఈ ఏజెన్సీలను ఎంపిక చేయనుంది. అనంతరం ఆయా ఏజెన్సీలు ప్రతి భవనంలో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్ మెంట్, స్మోక్, ఫైర్ డిటెక్టర్స్, స్ప్రింక్లర్స్, అలారం వ్యవస్థలు, ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానెళ్లు, వాటర్ ట్యాంకర్లు, అత్యవసర ద్వారాలు, స్టయిర్ కేసులు, లిఫ్టులు వంటి లైఫ్ సేవింగ్ వ్యవస్థలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తాయి.

తెలంగాణలో ఇలాంటి ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాల్సిన భవనాలు కనీసం 5 లక్షల వరకు ఉంటాయని అంచనా. 2023లో జరిగిన పరిశీలనలో 3వేల హైరైజ్ భవనాలను మాత్రమే తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు లక్షన్నర భవనాలు ఉండగా.. కేవలం 5వేల భవనాల తనిఖీ మాత్రమే జరిగింది.

2023 నుంచి ఇప్పటివరకు కేవలం ఐదు సంస్థలతోనే ఫైర్ ఆడిట్ నిర్వహించామని, ప్రస్తుత పరిస్థితుల్లో అవి సరిపోనందనున మరిన్న సంస్థల సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని, అక్కడ నుంచి అనుమతి వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

This website uses cookies.