poulomi avante poulomi avante

బాచుప‌ల్లిలో ఆర్క్ స‌మ్య‌క్ ఆరంభం!

  • మియాపూర్ మెట్రో స్టేష‌న్ చేరువ‌లోని బాచుప‌ల్లిలో
  • హైద‌రాబాద్‌లోనే ప్ర‌ప్ర‌థ‌మ కిడ్స్ ఫ్రెండ్లీ హోమ్స్ ప్రాజెక్టు
  • కొవిడ్ నేప‌థ్యంలో చిన్నారుల‌కు ప్రాధాన్య‌తనిచ్చే గృహాలు
  • సుమారు 2 ఎక‌రాలు.. 10 అంత‌స్తుల ఎత్తు..
  • 160 ఫ్లాట్లు.. ధ‌ర చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.5,500
  • జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌త్యేక డిస్కౌంటు

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో 33 ఏళ్ల అనుభ‌వం గ‌ల ఆర్క్ హోమ్స్ సంస్థ‌.. బాచుప‌ల్లిలో ప్ర‌ప్ర‌థ‌మంగా చిల్డ్ర‌న్ ఫ్రెండ్లీ హోమ్స్‌కు శ్రీకారం చుట్టింది. దీనికి ఆర్క్ స‌మ్య‌క్ అని నామ‌క‌ర‌ణం చేసింది. సుమారు రెండు ఎక‌రాల విస్తీర్ణంలో వ‌చ్చేవి 160 ఫ్లాట్లు. రెండు ట‌వ‌ర్ల‌లో ప‌ది ఫ్లోర్ల‌ను నిర్మిస్తోంది. ఫ్లాట్ల విస్తీర్ణం 1315 నుంచి 1760 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐజీబీసీ గోల్డ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. చ‌ద‌ర‌పు అడుక్కీ రూ. 5,500 చెబుతున్నారు. ప్రాజెక్టును రెండున్న‌రేళ్ల‌లో పూర్తి చేసేందుకు సంస్థ ప్ర‌ణాళిక‌ల్ని ర‌చిస్తోంది.

కొవిడ్ స‌మ‌యంలో చిన్నారులు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. వారు బ‌య‌టికి వెళ్లే అవ‌కాశమే లేకుండా పోయింది. ఈ ఇబ్బందిని గ‌మ‌నించిన త‌ర్వాతే.. కిడ్స్ ఫ్రెండ్లీ ఇళ్ల‌ను నిర్మించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు సంస్థ సీఈవో గుమ్మి మేఘ‌న తెలిపారు. చిన్నారులు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఆడుకునే విధంగా ఇంటీరియ‌ర్స్ మ‌రియు ఎక్స్‌టీరియ‌ర్స్ డిజైన్ చేశామ‌న్నారు. క్ల‌బ్ హౌజ్లో కేవ‌లం చిన్నారులు ఆడుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా ప్లే సెంట‌ర్‌కు రూప‌క‌ల్ప‌న చేశామ‌ని, ల్యాండ్ స్కేప్‌ను ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దామ‌ని చెప్పారు. ఈ ప్రాజెక్టును డిజైన్ చేసేట‌ప్పుడే ప్ర‌తి చిన్న విష‌యానికీ ప‌రిష్కారం చూపెట్టామ‌ని వివ‌రించారు. బుడ‌త‌ల కోసం సాకెట్ల‌ను వివిధ ఎత్తులో ఏర్పాటు చేశామ‌న్నారు.

హైద‌రాబాద్‌లోని రామాంత‌పూర్‌, బెంగ‌ళూరులోనూ కిడ్స్ ఫ్రెండ్లీ హోమ్స్ ను ఆరంభిస్తున్నామ‌ని సంస్థ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన సొసైటీగా తీర్చిదిద్దెమ‌ని తెలిపారు. ప‌ది, ప‌దిహేనేళ్ల క్రితం ఢిల్లీ ఎన్‌సీర్ రీజియ‌న్‌లో నెల‌కొన్న ప‌రిస్థితులే ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో నెలకొన్నాయ‌ని.. కాబ‌ట్టి కొనుగోలుదారులు అన్ని అంశాల్ని ప‌క్కాగా చూసుకన్నాకే ఇళ్లను కొనుగోలు చేయాల‌ని సూచించారు. లేకపోతే రానున్న రోజుల్లో హైద‌రాబాద్ మ‌రో ఎన్‌సీఆర్ మాదిరిగా మారే ప్ర‌మాదం ఉంద‌న్నారు. కాబ‌ట్టి, అత్యాశ‌కు పోకుండా స‌రైన బిల్డ‌ర్ వ‌ద్ద ఫ్లాట్లు కొనుగోలు చేయాల‌ని సూచించారు. ఇందులో కొనుగోలు చేయాల‌ని భావించే జ‌ర్న‌లిస్టుల‌కు చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.100 నుంచి 150 దాకా ప్ర‌త్యేక రాయితీని అంద‌జేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles