poulomi avante poulomi avante

కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ కు “ఔట్ స్టాండింగ్ కాంక్రీటు స్ట్రక్చర్-2021” అవార్డు

తెలంగాణ రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నది.ఔట్ స్టాండింగ్ కాంక్రీటు స్ట్రక్చర్-2021 విభాగంలో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నది.ఇండియన్ కాంక్రీటు ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ సెంటర్ ఆధ్వర్యంలో ఈనెల 23 నాడు ఈ అవార్డును నిర్వహుకులు ఆర్ అండ్ బి శాఖకు ప్రదానం చేశారు. ఈ అవార్డును శనివారం ఆర్ అండ్ బి ఈఎన్సీ లు రవీందర్ రావు, గణపతి రెడ్డి కలిసి రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మినిస్టర్ క్వార్టర్స్ లోని తన అధికారిక నివాసంలో అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణాలు శాశ్వత ప్రాతిపదికన,పూర్తి నాణ్యతతో జరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.ఇట్లాంటి అవార్డులే వాటికి నిదర్శనమన్నారు.ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నూతన సెక్రటేరియట్,అమరుల స్మారకచిహ్నం,అంబేద్కర్ విగ్రహం,మెడికల్ కాలేజీలు,సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, సమీకృత కలెక్టరేట్లు,కొత్త వంతెనలు లాంటి దీర్ఘకాలిక ప్రయోజనం పొందే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మించడం గర్వంగా ఉన్నదని తెలిపారు.

రోడ్లు-భవనాల శాఖ కు వచ్చిన ఈ అవార్డు అధికారుల్లో,ఉద్యోగుల్లో నూతనోత్సాహం నింపుతుందన్నారు.అవార్డు ప్రదానం చేసిన ఇండియన్ కాంక్రీటు ఇనిస్టిట్యూట్ కి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అందుకు కష్టపడి పని చేసిన అధికారులకు, ఉద్యోగులకు అందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles