poulomi avante poulomi avante

హైద‌రాబాద్‌లో.. భూముల ధ‌ర‌లు

  • 10 నుంచి 20 శాతం

తెలంగాణలో భూముల ధరలు కొంతమేర తగ్గాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు.. 10 నుంచి 20 శాతం మేర తగ్గుద‌ల కనిపిస్తోంది. దీనిపై రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భాగ్య‌న‌గ‌రంలో భూముల రేట్లు త‌గ్గితేనే.. ఫ్లాట్ల ధ‌ర‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని కొంద‌రు అంటున్నారు.

హైదరాబాద్ మినహా తెలంగాణలోని జిల్లాల్లో భూముల ధరల్లో కొంత మేర వ్యత్యాసం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ భూముల ధరలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. గత లోక్ సభ ఎన్నికల సమయం నుంచే భూముల ధరల్లో తగ్గుదల కనిపిస్తోందని స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. వివిధ కారణాలతో ప్రాంతాన్ని బట్టి భూముల ధరలు సుమారు 10 శాతం నుంచి 20 శాతం మేర తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలోని జిల్లా కేంద్రాల నుంచి మొదలు మండల, గ్రామాల్లో భూముల ధరలు కొంత మేర తగ్గాయి. లోక్ సభ ఎన్నికలకు ముందు ఎకరం కోటి రూపాయల ధర పలికితే ఇప్పుడు 80 నుంచి 90 లక్షల ధరలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే భూముల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆలోచిస్తున్నారని జిల్లాల్లోని రియల్ రంగ వ్యాపారులు చెబుతున్నారు. చాలా వరకు భూముల కొనుగోలు అగ్రిమెంట్స్ సమయం అయిపోయినప్పటికీ రిజిస్ట్రేషన్ కు ముందుకు రావడం లేదని అంటున్నారు. గతంలో నిర్ణయించిన భూమి ధరకు 10 నుంచి 20 శాతం మేర ధర తగ్గిస్తే కొనుగోలుకు ముందుకు వస్తున్నారని, తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో 5 ఎకరాల లోపు భూముల లావాదేవీలు ధరల తగ్గింపుతో కొనసాగుతుండగా.. 5 ఎకరాలపై కొనుగోలుకు సంబంధించిన‌ లావాదేవీలన్నీ చాలా వరకు వాయిదా పడుతున్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles