Categories: LATEST UPDATES

ముంబైలో నీతూకపూర్ కొత్త ఇల్లు

ప్రముఖ బాలీవుడ్ నటి నీతూ కపూర్ ముంబైలో కొత్త ఇల్లు కొన్నారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో రూ.17.4 కోట్లు వెచ్చించి 4 బీహెచ్ కే ప్రీమియం ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. సన్ టెక్ రియాల్టీ అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టు సిగ్నియా ఐల్ లోని 7వ అంతస్తులో 3,387 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విలాసవంతమైన ఫ్లాట్ ఉంది. దీనికి మూడు కార్ పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ మే 10న జరగ్గా.. స్టాంపు డ్యూటీ కింది రూ.1.04 కోట్లు చెల్లించారు. కాగా, నీతూ కపూర్ కంటే ముందు ఆలియా భట్ కూడా కొత్త ప్రీమియం అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. 2,497 చదరపు అడుగుల్లో ఉన్న కొత్త ప్రీమియం అపార్ట్ మెంట్ ను రూ.37.8 కోట్లకు కొన్నారు. ఏప్రిల్ 10న ఈ లావాదేవీ జరగ్గా.. స్టాంపు డ్యూటీ కింద రూ.2.26 కోట్లు చెల్లించారు. అదే రోజున ఆలియా తన సోదరి షాహీన్ భట్ కు రూ.7.68 కోట్ల విలువైన రెండు అపార్ట్ మెంట్లను కానుకగా ఇచ్చారు. ఇందుకు స్టాంపు డ్యూటీ కింద రూ.30.75 లక్షలు చెల్లించారు.

This website uses cookies.