poulomi avante poulomi avante

హైదరాబాద్ లో ఆఫీస్ ఖాళీలు పెరుగుతున్నాయ్

  • ప్రస్తుతం హైదరాబాద్ లో ఖాళీగా 28 మిలియన్ చదరపు అడగుల స్పేస్
  • వెస్టియన్ నివేదిక వెల్లడి

హైదరాబాద్ లో ఖాళీ ఆఫీస్ స్పేస్ పెరుగుతోంది. 2020 నుంచి మన భాగ్యనగరంలో 59.0 మిలియన్ చదరపు అడుగుల కొత్త నిర్మాణాలు రాగా, 48.5 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయాలు నిండాయి. వరుసగా ఐదు సంవత్సరాలుగా కొత్త నిర్మాణాలు ఆఫీస్ ఆక్యుపెన్సీని అధిగమించడంతో ఖాళీ కార్యాలయాలు గణనీయంగా పెరిగాయి. 2025వ సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి హైదరాబాద్ లో 28 మిలియన్ చదరపు అడుగుల ఖాళీ నిల్వలు ఉన్నాయి. ఇది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అత్యధికం.

ఈ మేరకు వివరాలను వెస్టియన్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆఫీసులకు బలమైన డిమాండ్ ఉన్నప్పటికీ, నగరంలో రాబోయే సరఫరా కూడా ఎక్కువగా ఉండటంతో 2025లో ఈ స్టాక్ మరింత పెరుగుతుందని అంచనా. అయితే, దేశవ్యాప్తంగా నిర్మాణ కార్యకలాపాలు త్రైమాసికాలవారీగా 39%, వార్షిక ప్రాతిపదికన 12% మందగించి 2025 మొదటి త్రైమాసికంలో 9.50 మిలియన్ చదరపు అడుగులకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో కొత్త సరఫరా లేకపోవడంతోపాటు 2025 మొదటి త్రైమాసికంలో చెన్నై, ముంబై, కోల్‌కతాలో కనీస సరఫరా మాత్రమే రావడం ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది.

అదే సమయంలో 2025 మొదటి త్రైమాసికంలో ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితి మధ్య దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో స్థిరమైన లీజింగ్ కార్యకలాపాలు జరిగాయి. ఫలితంగా, 2025 మొదటి త్రైమాసికంలో ఆఫీస్ ఆక్యుపెన్సీ గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 34% పెరిగి 17.96 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. పశ్చిమ నగరాల్లో (ముంబై మరియు పూణే) రియల్ ఎస్టేట్ కార్యకలాపాలలో గణనీయమైన పెరుగుదల దీనికి కారణం. ఈ వాటా 2024 మొదటి త్రైమాసికంలో 24% నుంచి 2025 మొదటి త్రైమాసికంలో 37శాతానికి పెరిగింది. నగరాల వారీగా చూస్తే.. 2025 మొదటి త్రైమాసికంలో బెంగళూరు 4.08 మిలియన్ చదరపు అడుగులతో దేశవ్యాప్తంగా ఆక్యుపెన్సీలో ఆధిపత్యం చెలాయించింది. తరువాత ముంబై 3.99 మిలియన్ చదరపు అడుగులతో ఉంది. 2025 మొదటి త్రైమాసికంలో కోల్‌కతా 0.23 మిలియన్ చదరపు అడుగుల అత్యల్ప ఆక్యుపెన్సీ నమోదు చేసింది. అయితే, ఇది సంవత్సరానికి 44% మరియు మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 289% పెరిగింది.

ALSO READ: విక్కీ కౌశల్ లీజు పునరుద్ధరణ, మూడేళ్లకు రూ.6.2 కోట్ల అద్దె

విలువ పరంగా త్రైమాసికంలో 3% తగ్గినప్పటికీ, 2025 మొదటి త్రైమాసికంలో భారతదేశవ్యాప్తంగా ఆక్యుపెన్సీలో బెంగళూరు వాటా 19% నుంచి 23శాతానికి పెరిగింది. అదేవిధంగా, విలువ పరంగా 11% తగ్గినప్పటికీ, ముంబై వాటా కూడా స్వల్పంగా ఒక శాతం పెరిగి 2025 మొదటి త్రైమాసికంలో 22 శాతానికి చేరుకుంది. పూణే వార్షిక శోషణలో 276% పెరుగుదలను నివేదించింది. దాని పాన్-ఇండియా వాటా 2024 మొదటి త్రైమాసికంలో 5% నుంచి 2025 మొదటి త్రైమాసికంలో 15 శాతానికి పెరిగింది. దీనికి విరుద్ధంగా చెన్నై 52% అత్యధిక వార్షిక తగ్గుదలను చూసింది. దాని వాటా 25% నుండి 9 శాతానికి తగ్గింది. 2025 మొదటి త్రైమాసికంలో 39% వాటాతో బెంగళూరు జీసీసీల్లో ముందుంది.

వార్షిక ప్రాతిపదికన 39%, విలువ 119% వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. 2025 మొదటి త్రైమాసికంలో బెంగళూరు 37% వాటాతో కొత్త సరఫరాల్లో ముందంజలో ఉండగా, పూణే 31% వాటాతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. బెంగళూరు వాటా మునుపటి త్రైమాసికంలో 21% నుంచి పెరగ్గా.. పూణే వాటా 15% నుంచి పెరిగింది. ఢిల్లీలో కొత్త సరఫరా గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2025 మొదటి త్రైమాసికంలో 2.6 మిలియన్ చదరపు అడుగులకు రెట్టింపు అయ్యాయి. ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 44% పెరిగింది. భారతదేశ ఆఫీస్ మార్కెట్ 2025 మొదటి త్రైమాసికంలో వృద్ధి కనబరిచిందని, దేశంలోని ప్రధాన కార్యాలయ మార్కెట్లలో స్థిరమైన డిమాండ్ దీనికి కారణమని వెస్టియన్ సీఈఓ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles