Categories: LATEST UPDATES

అజయ్ దేవగన్.. అరవై కోట్ల బంగళా

అజయ్ దేవగణ్ ముంబైలోని జుహూలో కొత్త బంగళా కొన్నారు. ఖరీదెంతో తెలుసా? సుమారు రూ.60 కోట్లు. ఔను.. అక్షరాల అరవై కోట్లు. మరి, ఇంత ఖర్చు పెట్టి కొనుగోలు చేసిన బంగళా ప్రత్యేకతలేమిటో తెలుసా?

బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవగణ్ జుహూలోని మాయానగరిలో కొనుగోలు చేసిన బంగళా 590 గజాల విస్తీర్ణంలో 5,310 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ ఇల్లు కొనేందుకు గత ఏడాది నవంబరు- డిసెంబరు నుంచి ప్రణాళికలు రచించగా.. మే 7న కొనుగోలు పూర్తి చేశారు. వాస్తవానికి, ఈ ఇల్లు ఖరీదు ఎంతలేదన్నా రూ. 65- 70 కోట్లు ఉంటుందట.

కాకపోతే, కరోనా వల్ల రేటు తగ్గడం పైగా మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ తగ్గించడం వంటి అంశాల వల్ల అజయ్ దేవగణ్ ఇల్లు కొనేశారు. పైగా, ఇంటీరియర్స్ పనులూ మొదలయ్యాయి. ఇటీవల అక్కడి స్థానిక ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ తగ్గించడంతో అమితాబ్ బచ్చన్ సైతం రూ.31 కోట్ల విలువైన ఫ్లాట్ మీద 93 లక్షల స్టాంప్ డ్యూటీ ఆదా చేసుకున్నారు.

కొత్త ఇంటికి దగ్గర్లో ఆలియా భట్, జాన్వీ కపూర్, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, ధర్మేంద్ర, అక్షయ్ కుమార్ తదితరులుంటారు. కొత్త ఇల్లు ప్రస్తుతమున్న ‘శక్తి’ భవనానికి చేరువలోనే ఉంటుంది. ఇందులోనే ప్రస్తుతం ఆయన భార్య కాజల్, పిల్లలు న్యాసా, యుగ్ తో కలిసి నివాసం ఉంటున్నారు. ఇదే కాకుండా, తనకు లండన్ లో రూ.54 కోట్ల ఖరీదైన విలాసవంతమైన భవనమూ ఉంది. అతని ఇంటి పక్కనే షారూక్ ఖాన్ కి ఒక ఇల్లు ఉందని సమాచారం.

This website uses cookies.