Categories: TOP STORIES

బాల‌కృష్ణ అక్ర‌మ ఆస్తులు.. రూ.250 కోట్ల‌ని ఏసీబీ అధికారిక‌ ప్ర‌క‌ట‌న‌

* అధికారికంగా వెల్ల‌డించిన ఏసీబీ జేడీ సుదీంద్ర

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కస్టడీ లో కిలక అంశాల్ని ఏసీబి జాయింట్ డైరెక్టర్ సుదీంద్ర తాజాగా వెల్ల‌డించారు. ఇప్పటి వరకూ శివ‌బాల‌కృష్ణ వ‌ద్ద‌ 214 ఎకరాల భూమిని, 19 ఓపెన్ ప్లాట్స్, ఒక విల్లా, 7 ఫ్లాట్ల‌ను గుర్తించామ‌ని తెలిపారు. మొత్తానికి, అత‌ని వ‌ద్ద సుమారు రూ.250 కోట్ల అక్ర‌మ ఆస్తుల్ని గుర్తించామ‌న్నారు. నవీన్ కుమార్ అరెస్ట్ తో పాటు మరో ముగ్గురు బినామీలను గుర్తించామ‌ని చెప్పారు. అదేవిధంగా, బాల‌కృష్ణకు స‌హ‌క‌రించిన ఉన్న‌తాధికారుల పాత్ర‌పై కూడా ఆరా తీస్తున్నామ‌ని తెలిపారు. బాల‌కృష్ణ బ్యాంకు లాకర్ల‌లో 18 తులాల బంగారం, ఒక పాస్ పుస్త‌కాన్ని గుర్తించామ‌న్నారు. త‌ను చేసిన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పై దర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.

This website uses cookies.