Categories: LATEST UPDATES

కంటోన్మెంట్ బిల్డింగ్ బైలాస్ కు రక్షణశాఖ ఓకే

  • మరో మూడు నెలల్లో అమల్లోకి..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్ సీబీ)లో సవరణ చేసిన బిల్డింగ్ బైలాస్ ఖరారయ్యాయి. ఈ మేరకు ఎస్ సీబీ అధికారులు పంపించిన సవరణ బైలాస్ కు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. మరో మూడు నెలల్లో ఇవి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ పరిధిలోని ఇళ్ల యజమానులు తమ భవనాలపై అదనపు అంతస్తులు నిర్మించుకునే వెసులుబాటు కలిగింది. సవరణ చేసిన బైలాస్ మరో మూడు నెలల్లో అమల్లోకి వస్తాయని బోర్డు నామినేటెడ్ పౌర సభ్యుడు జె.రామకృష్ణ తెలిపారు.

ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన బోర్డుక సంబంధించిన పలు అంశాలను డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ (డీజీడీఈ), కేంద్ర రక్షణ కార్యదర్శికి వివరించారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కొత్త భవన బైలాస్ పై రక్షణశాఖ లేవనెత్తిన పలు సందేహాలపై బోర్డు అధికారులు వివరణ ఇచ్చారని తెలిపారు.

This website uses cookies.