Categories: LATEST UPDATES

రూ.10 వేలకే.. బడా సంస్థల్లో వాటా

దేశంలోని అతిపెద్ద వాణిజ్య భవనంలో స్థలం కొనాలని ఉందా?

అది కేవలం బడా బాబులకే సాధ్యమవుతుంది.. తమ లాంటి వారు కొనగలరా? అన్నది మీ సందేహమా?
అలాంటి సందేహాలేమీ పెట్టుకోవద్దు. ఇక నుంచి మీరూ ఎలాంటి బడా వాణిజ్య సముదాయాల్లోనైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందుకోసం మీ వద్ద కోట్ల రూపాయలు ఉండక్కర్లేదు. రీట్, ఇన్విట్ కనీస దరఖాస్తు విలువను తగ్గిస్తూ సెబీ జులై 30న సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రీట్లలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు.. కనీస దరఖాస్తు విలువను రూ.50 వేల బదులు రూ.10వేలు చేసింది. ఇన్విట్లలో మదుపు చేసేవారు లక్ష రూపాయల బదులు పదిహేను వేలుగా నిర్ణయించింది.

అంటే, రీట్లలో మదుపు చేయాలనుకుంటే.. ఎన్ని పదివేలు అయినా మీరు పెట్టుబడి పెట్టవచ్చన్నమాట. గతంలో అయితే కనీసం వంద యూనిట్లు కొనాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు మీ వద్ద ఎంత సొమ్ముంటే అన్ని యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.

రీట్లు, ఇన్విట్లు.. విదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందాయి. బడా వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు రీట్ల ద్వారా పెట్టొచ్చు. జాతీయ రహదారులు, విద్యుత్తు రంగ సంస్థల్లో మదుపు చేయలని భావించేవారు ఇన్విట్ల ద్వారా అడుగు ముందుకేయాల్సి ఉంటుంది. మన దేశంలో ఇప్పటివరకూ దాదాపు 4 రీట్లు, 15 ఇన్విట్లు నమోదయ్యాయి. వీటిలో 6 ఇన్విట్లు, 3 రీట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదు కావడం గమనార్హం. వీటిలో పెట్టిన మొత్తం పెట్టుబడి విలువ.. దాదాపు రూ.1.64 లక్షల కోట్ల దాకా ఉంటుంది.

This website uses cookies.