Categories: TOP STORIES

మోకిల‌లో మొద‌టి రోజు వేలంలో గ‌జం ధ‌ర ఎంత ప‌లికింది?

మోకిలలో హెచ్ఎండిఏలో ప్లాట్ల వేలానికి అమిత ఆద‌రణ లభిస్తుంది. మొదటి రోజు ఆన్ లైన్‌ వేలంలో గజం అత్యధికంగా లక్ష రూపాయల ధర ప‌లికింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిలలో చేస్తున్న భారీ వెంచర్లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించారు. రెండో దశలో 300 ప్లాట్లను హెచ్ఎండిఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి ద్వారా బుధ‌వారం నుంచి ఐదు రోజులపాటు ఆన్ లైన్ వేలం ప్రక్రియను నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. బుధవారం మొదటి రోజు ఉదయం 30 ప్లాట్లకు, మధ్యాహ్నం మరో 30 ప్లాట్లకు వేలం ప్రక్రియ జరిగింది. వీటిలో అత్యధికంగా గజం లక్ష రూపాయల చొప్పున మోకిల భూముల రేటు పలకడం విశేషం. మోకిలా లేఅవుట్లో తొలి రోజు గజం రేటు సరాసరిగా రూ.63,513లుగా నమోదైంది. మొదటి రోజు 58 ప్లాట్ల అమ్మకాల ద్వారా రూ.122.42 కోట్ల ఆదాయం చేకూరింది. మోకిల హెచ్ఎండిఏ లేఅవుట్ కోకాపేట్ నియో పోలీసుకు దగ్గరలో ఉండటం వల్ల మంచి డిమాండ్ నెలకొంది.

This website uses cookies.