poulomi avante poulomi avante

హెచ్ఎండీఏ ఉన్న‌తాధికారుల‌కు విల్లాల్ని గిఫ్టుగా ఇచ్చిందెవ‌రు?

#GiftsToHmdaOfficials

  • 111 జీవో అక్ర‌మ నిర్మాణాల‌పై
    క‌ఠిన చ‌ర్య‌లెప్పుడు?
  • చూసీచూడ‌న‌ట్టు ఉండేందుకు
    ఫ్లాట్ల‌ను ఎర‌వేసిందెవ‌రు?

ఎన్నిక‌ల సంద‌ర్భంగా పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి.. ట్రిపుల్ వ‌న్ జీవోపై అప్ప‌టి ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడాల‌ని.. జంట జ‌లాశ‌యాల్ని ప‌రిర‌క్షించాల‌ని ఎలుగెత్తి చాటారు. గ‌త ప్ర‌భుత్వం ట్రిపుల్ వ‌న్ జీవోను ర‌ద్దు చేయ‌డం ప‌ట్ల ఆయ‌న తీవ్రంగా విమ‌ర్శించారు. 111 జీవో ర‌ద్దు అణుబాంబు విస్పోటం వంటిద‌ని అప్ప‌ట్లో దుయ్య‌బ‌ట్టారు. మ‌రి, రేవంత్ రెడ్డి తెలంగాణ‌కు ముఖ్య‌మంత్రి అయిన నేప‌థ్యంలో.. ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతంలో వెలిసిన అక్ర‌మ నిర్మాణాల్ని పూర్తిగా ధ్వంసం చేయాల‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు కోరుతున్నారు.

2023 ఎన్నిక‌ల్లోనూ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని అనేక మంది బిల్డ‌ర్లు, డెవ‌ల‌ప‌ర్లు ట్రిపుల్ వ‌న్ జీవోలోని ప‌లు ప్రాంతాల్లో బ‌డా సైజు విల్లాల్ని అభివృద్ధి చేశారు. కొంద‌రైతే అపార్టుమెంట్ల‌ను ఆరంభించారు. ఇంకొంద‌రేమో ఏకంగా గేటెడ్ క‌మ్యూనిటీ వెంచ‌ర్ల‌ను నిర్మించారు. జంట జ‌లాశ‌యాల‌కు చేరువ‌లోనే అనేక విల్లా క‌మ్యూనిటీల‌ను డెవ‌ల‌ప్ చేశారు. మ‌రి, ఇప్ప‌టికే డెవ‌ల‌ప్ చేసిన‌వాటితో పాటు కొత్త‌గా నిర్మిస్తున్న ప్రాజెక్టుల‌న్నీ పూర్తిగా నేల‌మ‌ట్టం చేయాల‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. కేటీఆర్ ఫామ్‌హౌజ్ మీద గ‌తంలో అనేక విమ‌ర్శ‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. దానిపై ప్ర‌స్తుతం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటార‌నే అంశం మార్కెట్లో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

జంట జలాశయాల క్యాచ్ మెంట్ ఏరియాలో.. గృహ స‌ముదాయాలు, హోటళ్లు, మాల్స్, వాణిజ్య భవనాల వంటివాటిని నిర్మించ‌కూడ‌దు. అయినా కూడా గ‌త ప్ర‌భుత్వ పెద్ద‌ల ప్రోత్సాహంతో అనేక మంది ట్రిపుల్ వ‌న్ జీవో ప్రాంతాల ప‌రిధిలో అక్ర‌మ నిర్మాణాల్ని ఆరంభించారు. త‌క్కువ విస్తీర్ణంలో అతిపెద్ద సైజులో విల్లాలంటూ ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు విల్లా క‌మ్యూనిటీల‌ను మొద‌లెట్టారు. అయినా, అప్ప‌టి హెచ్ఎండీఏ అధికారులు చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేశారు. కార‌ణం, వాటిలో ఒక‌రిద్ద‌రు ఉన్న‌తాధికారుల‌కు విల్లాల్ని ముట్ట‌చెప్ప‌డ‌మేన‌ని హెచ్ఎండీఏ వ‌ర్గాలు చెబుతున్నారు. ప్ర‌భుత్వం గ‌న‌క కాస్త లోతుగా ద‌ర్యాప్తు చేస్తే.. ఏయే అధికారుల‌కు ఎన్నెన్ని విల్లాలు ఉన్నాయో తెలుస్తుంద‌ని బిల్డ‌ర్లు అంటున్నారు. ఏదీఏమైనా, ట్రిపుల్ వ‌న్ జీవో అక్ర‌మ నిర్మాణాల్ని వెంట‌నే నేల‌మ‌ట్టం చేసి.. జంట జ‌లాశయాలు కాలుష్యం బారిన ప‌డ‌కుండా కాపాడాల‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles