poulomi avante poulomi avante

నిబంధ‌న‌ల‌కు లోబ‌డి డెవ‌ల‌ప్ చేస్తున్నాం..

వాసవి గ్రూప్ ఛైర్మన్ అభిషేక్ చందా

భవన నిర్మాణాలకు సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రముఖ నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్ కోరింది. తమ సంస్థపై ఆయా ఛానల్స్ లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చందా ఖండించారు. గత 30 ఏళ్లుగా చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు చేపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఓ హోటల్ జరిగిన మీడియా సమావేశంలో అభిషేక్ చందా మాట్లాడారు.. తమ కస్టమర్లను ఆందోళనకు గురి చేసే విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేసిన ఆయా యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో చేపడుతున్న వాసవి సరోవర్ ప్రాజెక్టు చిన్న మైసమ్మ చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నట్లుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయని, వాటిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామన్నారు.

గతంలో ప్రభుత్వ అభ్యర్థన మేరకు కూకట్ పల్లిలోని చిన్న మైసమ్మ చెరువును ను వాసవీ నిర్మాణ సంస్థ దత్తత తీసుకుని రూ.7 కోట్లతో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. చెరువును మినీ ట్యాంక్ బండ్ మాదిరిగా అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పనుల కోసం లేక్ మధ్యలో వేసిన రోడ్డును తాము ఆక్రమించినట్టుగా యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేయడం బాధాకరమని అభిషేక్ చంద్ అన్నారు. ఈ చెరువు అభివృద్ధి పనులు 2027 నాటికల్ల చెరువు అభివృద్ది పనులు పూర్తి అవుతాయని ఆయన చెప్పారు. అలాగే కోమటికుంట చెరువును కూడా వాసవి నిర్మాణ అభివృద్ది చేస్తుందన్నారు. ఈ రెండు చెరువులు అభివృద్ధి కోసం గతంలోనే ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకోవడం జరిగిందన్నారు. చెరువు వద్దకు సులభంగా చేరుకునేందుకు తమ సంస్థకు చెందిన సుమారు రెండెకరాల భూమిని ప్రభుత్వానికి గిఫ్టు డీడ్ చేయడం జరిగిందన్నారు.

మరికొన్ని నిర్మాణ సంస్థలతో కలిసి రాజీవ్ గాంధీ నగర్ కాలనీ ముంపు సమస్యను పరిష్కరించేందుకు రూ.1.20 కోట్ల వ్యయంతో స్ట్రాంగ్ వాటర్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 30 ఏళ్లుగా తమ వాసవి నిర్మాణ సంస్థ 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టులను, 17 కమర్షియల్ ప్రాజెక్టులు, 310 ఎకరాల్లో విల్లాప్లాట్లు, 4510 అపార్టుమెంట్లను , 20 వేల హ్యాపీ రెసిడెంట్స్ ను నిర్మించిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 8 మిలియన్ చదరపు పీట్ల ఏరియాలో నిర్మాణాలు చేపట్టామని, రానున్న ఐదేండ్లలో 50 మిలియన్ చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.

30 ఏళ్ల డెవ‌ల‌ప‌ర్‌పై
అలా మాట్లాడ‌టం బాధాక‌రం

వాస‌వి సంస్థ అనేక ఇబ్బందుల్ని అధిగ‌మించి నిల‌దొక్కుకుంది. వ్యాపారంలో ఉన్న‌ప్పుడు నుంచి దాదాపు ఆరు ముఖ్య‌మంత్రుల్ని చూశాం. 1994 నుంచి 2024 ఏ రాజ‌కీయ పార్టీలతో మాకు సంబంధం లేదు. మేం క‌బ్జాలు చేస్తున్నార‌ని చాలామంది ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. 30 ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉన్న డెవ‌ల‌ప‌ర్ల‌లో అతికొద్దిమంది ఉన్నారు. అలాంటి వారి మీద ఎలాంటి గౌర‌వం లేకుండా కొంద‌రు త‌ప్పుగా చిత్రీక‌రిస్తుండ‌టం బాధాక‌రం

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles