poulomi avante poulomi avante

రూ.45 కోట్లతో 5 ఆఫీస్ స్పేస్‌లు

ముంబై అంధేరీలో కొన్న‌ అజయ్ దేవగన్

బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు అజయ్ దేవగన్ ఐదు ఆఫీస్ ప్రాపర్టీలు కొనుగోలు చేశారు. ముంబై అంధేరీలోని ఓషివరాలోని ఈ కమర్షియల్ ప్రాపర్టీలను రూ.45 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఐదు ప్రాపర్టీలు కలిసి 13,293 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో ఉన్నాయి. వీర్ సావర్కర్ ప్రాజెక్టులోని ఈ ప్రాపర్టీ నిర్మాణ దశలో ఉంది. ఇందులోని మూడు ఆఫీసులు 16వ అంతస్తులో 8,404 చదరపు అడుగుల్లో.. మరో రెండు కార్యాలయాలు 17వ అంతస్తులో 4,893 చదరపు అడుగుల్లో ఉన్నాయి. ఈ ఐదు ఆఫీస్ స్పేస్ లతోపాటు 14 కార్ పార్కింగ్ స్లాట్ లు కూడా లభిస్తాయి. ఐదు ఆఫీస్ స్పేస్ లను రెండు లావాదేవీల్లో అజయ్ దేవగన్ కొనుగోలు చేశారు. ఏప్రిల్ 18, 19వ తేదీల్లో జరిగిన ఈ రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ కింద రూ.2.7 కోట్లు చెల్లించారు. కాగా, ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖుల నుంచి వ్యాపారవేత్తల వరకు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత కాలంలో సినీ ప్రముఖులు రియల్ రంగంలోనే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి హై ఎండ్ లగ్జరీ ప్రాపర్టీలను సొంతం చేసుకుంటున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles