poulomi avante poulomi avante

అపార్ట్ మెంట్లు అమ్మేసిన అమితాబ్, అక్షయ్..

బాలీవుడ్ ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ముంబైలోని తమ అపార్ట్ మెంట్లు అమ్మేశారు. అమితాబ్ తన ప్రీమియం డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను రూ.83 కోట్లకు విక్రయించగా.. అక్షయ్ కుమార్ తన అపార్ట్ మెంట్ ను రూ.4.25 కోట్లకు అమ్మేశారు. అమితాబ్ కు ముంబై ఓషివారాలో డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్ ఉంది. ఇది 5,185.62 చదరపు అడుగుల కార్పెట్ ప్రాంతంతో విస్తరించి ఉంది. అలాగే 4,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన టెర్రస్‌ను కలిగి ఉంది. ఆరు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. దీనిని ఆయన రూ.83 కోట్లకు విక్రయించగా.. ఈ లావాదేవీకి రూ. 4.98 కోట్ల స్టాంప్ డ్యూటీ కింద కొనుగోలు చెల్లించారు. మరోవైపు అక్షయ్ కుమార్ ముంబై బోరివలిలోని తన అపార్ట్ మెంట్ ను రూ.4.25 కోట్లకు విక్రయించారు. ‘

ఒబెరాయ్ రియల్టీ ప్రాజెక్టు స్కై సిటీలో ఈ అపార్ట్ మెంట్ ఉంది. 1073 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఉన్న ఈ ఫ్లాట్ కు రెండు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంపు డ్యూటీ కింద రూ.25.5 లక్షలు, రిజిస్ట్రేషన్ కోసం రూ.30వేలు కొనుగోలుదారు చెల్లించారు. స్కై సిటీ ప్రాజెక్టు 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. 3 బీహెచ్ కే, 3 బీహెచ్ కే ప్లస్ స్టూడియో, డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్లు ఇందులో ఉన్నాయి. కాగా, అక్షయ్ కుమార్ 2017 నవంబర్ లో ఈ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. అప్పుడు ఆయన రూ.2.38 కోట్లు చెల్లించారు. ఇప్పుడు అది రూ.4.25 కోట్లకు అమ్ముడైంది. అంటే.. 78 శాతం పెరుగుదల కనిపించింది. బిగ్ బి అమితాబ్ తోపాటు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కు కూడా స్కై సిటీలో ప్రాపర్టీలు ఉన్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles