poulomi avante poulomi avante

టాప్-10 ఏపీఏసీ నగరాల్లో ముంబై, ఢిల్లీ

రియల్ రంగంలో సీమాంతర పెట్టుబడులు పెట్టడానికి అనువైన ఏసియా ఫసిఫిక్ (ఏపీఏసీ) నగరాల టాప్-10 జాబితాలో ముంబై, ఢిల్లీ నగరాలకు స్థానం లభించింది. ముంబై 5వ స్థానంలో ఉండగా.. ఢిల్లీ 8వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు వివరాలరు సీబీఆర్ఈ వెల్లడించింది. జాబితాలో టోక్యో ప్రథమ స్థానంలో ఉండగా.. సిడ్నీ, సింగపూర్, హోచిమిన్ సిటీలు రెండు నుంచి నాలుగు స్థానాల్లో నిలిచాయి. సియోల్, ఒసాకా, హనోయ్‌లు కూడా ఢిల్లీతోపాటు 8వ స్థానంలో ఉన్నాయి. కాగా, దేశంలో నికర కొనుగోలు ఉద్దేశాలు 3 శాతానికి చేరుకున్నాయి. డెవలపర్/యజమాని/ఆపరేటర్, రియల్ ఎస్టేట్ ఫండ్, సంస్థాగత పెట్టుబడిదారులు బలమైన కొనుగోలు ఉద్దేశాలను ప్రదర్శించారు. భారతదేశంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్.. ఆఫీస్, నివాస, పారిశ్రామిక & డేటా సెంటర్ల చుట్టూనే కేంద్రీకృతమై ఉందని సీబీఆర్ఈ నివేదిక పేర్కొంది.

2024లో భారతదేశం బలమైన విదేశీ ఈక్విటీ పెట్టుబడుల ప్రవాహాలను నమోదు చేసింది. సింగపూర్, అమెరికా, కెనడా వంటి దేశాలు విదేశీ ఈక్విటీ పెట్టుబడులలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ మూడు దేశాలు 2024లో దేశ రియల్ ఎస్టేట్‌లో మొత్తం ఈక్విటీ పెట్టుబడులలో 25% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం విదేశీ ఈక్విటీ పెట్టుబడులలో సింగపూర్ దాదాపు 36% వాటాను కలిగి ఉంది. తరువాత అమెరికా 29%, కెనడా 22% వాటాతో ఉన్నాయి. 2023తో పోలిస్తే 2024లో యూఏఈ పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. భారతీయ రియల్ ఎస్టేట్‌లో మొత్తం ఈక్విటీ పెట్టుబడి 2024లో 11.4 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదిక ఇది 54 శాతం అధికం. “భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెట్టుబడి 2024లో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రధానంగా దేశీయ పెట్టుబడిదారుల ఆధిపత్యంలో ఉన్నప్పటికీ, విదేశీ ఈక్విటీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడులు ప్రపంచ రియల్ ఎస్టేట్ గమ్యస్థానంగా పెరుగుతున్న భారతదేశ ప్రాముఖ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి’ అని సీబీఆర్ఈ చైర్మన్, సీఈఓ అన్షుమన్ మ్యాగజీన్ తెలిపారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles