Categories: TOP STORIES

నాలా ఛార్జీలను.. స్థానిక సంస్థ‌ల‌కే చెల్లిస్తాం

  • మున్సిప‌ల్ మంత్రి కేటీఆర్‌కి విన్న‌వించిన
    టీబీఎఫ్ అధ్య‌క్షుడు సీహెచ్ ప్ర‌భాక‌ర్ రావు

హైద‌రాబాద్ డెవ‌ల‌ప‌ర్లు ఎదుర్కొంటున్న నాలా ఛార్జీల చెల్లింపు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు తెలంగాణ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్ న‌డుం బిగించింది. ఈ మేర‌కు అనుమ‌తి తీసుకునేట‌ప్పుడే నాలా ఛార్జీలను జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండీఏకు చెల్లించేలా అనుమ‌తించాల‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌ను టీబీఎఫ్ అధ్య‌క్షుడు సీహెచ్ ప్ర‌భాక‌ర్ రావు కోరారు. ఇటీవ‌ల ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్‌ని క‌లిసిన ఆయ‌న.. ధ‌ర‌ణిలో పాత ప్లాట్లలో అపార్టుమెంట్లు క‌ట్టే స‌మ‌యంలో.. నాలా ఛార్జీల చెల్లింపుల విష‌యంలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయ‌ని వివ‌రించారు. ప్ర‌ధానంగా చిన్న బిల్డ‌ర్లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. దీంతో, అపార్టుమెంట్ నిర్మాణం పూర్త‌యిన‌ప్ప‌టికీ ఎన్వోసీ మంజూరులో ఆల‌స్యం జ‌రుగుతోంద‌ని చెప్పారు. చిన్న బిల్డ‌ర్లు ఎదుర్కొంటున్న ఈ స‌మ‌స్య‌ను సానుకూలంగా విన్న మంత్రి కేటీఆర్‌.. ప‌రిష్క‌రించేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.

This website uses cookies.