Categories: LATEST UPDATES

బిగ్ బ్రేకింగ్‌: వంశీరాం బిల్డ‌ర్స్ పై ఐటీ దాడులు

వంశీ రాం బిల్డర్స్ కార్యాలయం, ఇళ్లలో ఐటీ అధికారులు సోదాల‌ను నిర్వ‌హించారు. వంశీరాం సంస్థ అధినేత సుబ్బారెడ్డి బావమరిది జనార్ధన్‌రెడ్డి ఇంట్లో సోదాలు జ‌రుపుతున్నారు. మొత్తం ప‌దిహేను చోట్ల సోదాలను జ‌రుపుతున్నారు. వంశీరామ్ బిల్డర్స్ ఐటీ తనిఖీల్లో భాగంగా.. విజయవాడలోని ఇద్దరు వైసీపీ నేతలైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఇళ్లలో సోదాల‌ను నిర్వ‌హిస్తుండటం గ‌మ‌నార్హం. గ‌తంలో వాస‌వి, సుమ‌ధుర‌, ఫినీక్స్ వంటి సంస్థ‌ల త‌ర్వాత వంశీరాం బిల్డ‌ర్స్ పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయి.

ఈ సంస్థ ఎండీ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌కు స‌న్నిహితుడైన కార‌ణంగానే ఐటీ దాడులు జ‌రుగుతున్నాయ‌నే ప్ర‌చారం రియ‌ల్ వ‌ర్గాల్లో నెల‌కొంది. కేవ‌లం రాజ‌కీయ కోణంలో భాగంగానే ఐటీ సోదాలను నిర్వ‌హిస్తున్నార‌నే వ్యాఖ్యాలు వినిపిస్తున్నియి. మ‌రి, గ‌తంలో జ‌రిపిన ఐటీ దాడులకు సంబంధించి ఐటీ విభాగం అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This website uses cookies.