Categories: LATEST UPDATES

భవనం కూలిన కేసులో బిల్డర్ అరెస్ట్

నిర్మాణంలో ఉన్న భవనం కూలి, ఇద్దరు మహిళలు చనిపోయిన ఘటనకు సంబంధించిన కేసులో సంబంధిత నిర్మాణ కంపెనీ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మనీష్ స్విచ్ గేర్ అండ్ కన్ స్ట్రక్షన్ ప్రొప్రైటర్ అమిత్ ఆస్టన్ ను అరెస్టు చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. గురుగ్రామ్ సెక్టార్ 109లోని చింటెల్స్ పారాడిసో ప్రాజెక్టు టవర్ డీ నిర్మాణంలో ఉన్నప్పుడు ఆరో అంతస్తు రూఫ్ కూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇందుకు చింటల్స్ ఇండియా, మనీష్ స్విచ్ గేర్ అండ్ కన్ స్ట్రక్షన్స్ బాధ్యులని గుర్తించారు. ఈ నేపథ్యంలో తాజాగా మనీష్ స్విచ్ గేర్ యజమానిని అరెస్టు చేశారు.

This website uses cookies.