Categories: LEGAL

రూ.11 కోట్ల మోసం కేసులో బిల్డర్ అరెస్ట్

తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తానని చెప్పి పలువురి దగ్గర నుంచి రూ.11 కోట్లు దోచుకున్న రియల్ ఎస్టేట్ బిల్డర్ కటకటాలపాలయ్యాడు. ప్రయాగ్ రాజ్ కు చెందిన అనిల్ కుమార్ తుల్సియాని (58) పలువురిని ఇలా మోసం చేశాడు. అతడిపై వివిధ జిల్లాల్లో 20కి పైగా కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉండటంతో అనిల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. ప్రభుత్వ ఆస్తులను తన సొంతమని, తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తానని చెప్పి పలువురికి వల వేసేవాడని పోలీసులు తెలిపారు.

అనంతరం నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలతో బురిడీ కొట్టించి, పలువురి దగ్గర నుంచి రూ.11 కోట్ల వసూలు చేసినట్టు వివరించారు. అనంతరం కనిపించకుండా పోవడంతో పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాలుగేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న అనిల్ తాజాగా లక్నోలో పోలీసులకు చిక్కడంతో అతడిని అరెస్టు చేశారు.

This website uses cookies.