Categories: LATEST UPDATES

కెన‌డా సంస్థ‌.. జీనోమ్ వ్యాలీలో పెట్టుబ‌డి

కెనడాకు చెందిన ఇవాన్ హో  కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్ తెలంగాణలోని జీనోమ్ వ్యాలీలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. జీనోమ్ వ్యాలీలో సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు 740కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటన చేసింది. ఇవాన్ హో కేంబ్రిడ్జ్ ఎంఎన్ పార్కులో సుమారు 10 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం మేర ల్యాబ్ స్పేస్ లో ఈ పెట్టుబడిని పెడ‌తారు. కెనెడియన్ ఫండ్ దక్షిణాసియాలో మొదటిసారిగా లైఫ్ సైన్సెస్ రంగంలో ఇంత భారీ పెట్టుబడి పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారతదేశంలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ రంగ పరిశోధన మరియు అభివృద్ధి క్లస్టర్ అయిన జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలలు కొనసాగిస్తున్నాయని వివ‌రించారు. ఈ పెట్టుబడి ద్వారా ప్రభుత్వం యొక్క లైఫ్ సైన్సెస్ రంగ ఫోకస్ కి ఊతం లభిస్తుందన్నారు. ఈ పెట్టుబడి ద్వారా జీనోమ్ వ్యాలీలో మరింత లాబోరేటరీ స్పేస్ పెరగడంతో పాటు పరిశోధన, అభివృద్ధి మరియు లైఫ్ సైన్సెస్ అనుబంధ మౌలిక వసతులు రానున్న కాలంలో మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత భారీ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్న కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. కంపెనీకి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.

This website uses cookies.