Categories: LATEST UPDATES

మార్చి 8 నుంచి 10 దాకా క్రెడాయ్ ప్రాప‌ర్టీ షో..

క్రెడాయ్ హైద‌రాబాద్ ప‌ద‌మూడో ఎడిష‌న్ ప్రాప‌ర్టీ షోను మార్చి 8 నుంచి 10వ తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వ‌హిస్తోంది. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో క్రెడాయ్ హైద‌రాబాద్ వెల్ల‌డించింది. ఈ మూడు రోజుల ప్రాప‌ర్టీ షోలో.. సుమారు అర‌వై మంది డెవ‌ల‌ప‌ర్లు పాల్గొంటారు. వంద‌కుపైగా ప్రాజెక్టుల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. ఇందులో అపార్టుమెంట్లు, విల్లాలు, ప్లాట్లు, వాణిజ్య స్థ‌లాలు వంటి వివ‌రాల్ని స‌మాచారాన్ని సంద‌ర్శ‌కుల‌కు అందజేస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు సైతం ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొంటాయి.

This website uses cookies.