Categories: TOP STORIES

స్టేట్‌కాన్‌ 2024కు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన క్రెడాయ్ తెలంగాణ

ఆగ‌స్టులో క్రెడాయ్ తెలంగాణ నిర్వహించే రాష్ట్ర స్థాయి సదస్సును (STATCON-2024) ప్రారంభించడానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని క్రెడాయ్ తెలంగాణ అధికారికంగా బుధ‌వారం ఆహ్వానించింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ వ్యాప్తంగా సుమారు 900 మంది డెవలపర్లు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ నిర్మాణ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించాల‌న్న‌ది ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యం. గ‌తంలో నిర్వ‌హించిన ఈ స్టేట్‌కాన్‌కు ముఖ్య అతిథిగా అప్ప‌టి గ‌వ‌ర్న‌ర్ త‌మిళసై విచ్చేశారు. సీఎంను క‌లిసి ఆహ్వానించిన‌వారిలో.. క్రెడాయ్ తెలంగాణ‌కు చెందిన ఆఫీస్ బేరర్లు ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మురళీకృష్ణా రెడ్డి (ఛైర్మన్), ప్రేంసాగర్ రెడ్డి (అధ్యక్షుడు), కె. ఇంద్రసేనారెడ్డి (అధ్యక్షుడు- ఎల‌క్ట్‌), అజయ్ కుమార్ (కార్యదర్శి), మరియు జగన్మోహన్ (కోశాధికారి) త‌దితరులు ఉన్నారు.

This website uses cookies.