డా. జీబీకే రావుకు అవార్డులు కొత్తేం కాదు. ఇప్పటికే అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల్ని అందుకున్నారు. తాజాగా ఆయన అగ్రి బిజినెస్ సమ్మిట్ మరియు అగ్రి అవార్డ్స్ వారి వ్యూహాత్మక విజన్ కలిగిన నాయకుడు అనే అవార్డును అందుకున్నారు. ఈ రంగంలో అత్యుత్తమ ప్రపంచ ప్రమాణాలను నిర్వహిస్తున్నందుకు ఆయనకు ఈ గౌరవం దక్కింది. ఆయన దశాబ్దాలుగా చేస్తున్న కృషికి ఫలితమే ఈ అవార్డు అని చెప్పొచ్చు.
డాక్టర్ జి.బి.కె. రావు శంకర్ పల్లి చేరువలో ప్రగతి సుధామ అనే అద్భుతమైన ప్రదేశాన్ని సృష్టించారు, అక్కడ కాలుష్యం, చెడు బ్యాక్టీరియా, వైరస్ ముప్పు ఉండనే ఉండదు. 1994లో ఆకలి, కాలుష్య రహిత, దోమ రహిత, చెడు బాక్టీరియా రహిత, వైరస్ రహిత మరియు వ్యాధిరహిత సమాజం సృష్టించడానికి హీలింగ్ గార్డెన్ ఏర్పాటు చేశారు. 1998 నుంచి అన్ని బాక్టీరియల్, వైరస్ మరియు సాధారణ వ్యాధులకు ప్రగతి గ్రూప్ ఆయుర్వేద ఔషధాల్ని అందించింది.
మన వైదిక సంస్కృతిని తిరిగి తీసుకురావడంతో పాటు ఆకుపచ్చ జీవన ప్రదేశాలను సృష్టించే రంగంలో డా. జీబీకే రావును గొప్ప నాయకుడిగా చేసింది. అతని దూరదృష్టి ఈ సమాజానికెంతో మేలు చేసింది. భారతీయ వేద సంస్కృతి, వృక్షో రక్షతి రక్షితః, గో రక్షణ వంటివి ఆచరించారు. ఆరోగ్య ప్రదాతలైన “కల్ప వృక్షాలు – కామధేనువులు” యొక్క ప్రధాన భావనల్ని ఆచరిస్తున్నారు. రెండున్నర దశాబ్దాల నుంచి ఆయన చేసిన ప్రయత్నాలు 2500 ఎకరాల బంజరు భూముల్ని 45 లక్షల చెట్లు, లక్షలాది ఔషధ సుగంధ మూలికా పవిత్రమైన తల్లి మొక్కలతో పచ్చని స్వర్గంగా మార్చాయి.
This website uses cookies.