poulomi avante poulomi avante

కోకాపేటలో గోద్రేజ్ మాడిసన్ అవెన్యూ

  • 48 అంతస్తుల్లో ప్రీమియం
    రెసిడెన్షియల్ ప్రాజెక్టు ప్రారంభం

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గోద్రేజ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ లో తన మొదటి ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టు.. గోద్రేజ్ మాడిసన్ అవెన్యూను కోకాపేటలో ప్రారంభించింది. మూడు ఎకరాల స్థలంలో 4 బేస్ మెంట్, 48 అంతస్తుల్లో 1.2 మిలియన్ చదరపు అడుగుల విక్రయ ప్రాంతంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఇందులో వివిధ పరిమాణాల్లో 3, 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు అందుబాలోకి వస్తాయి. 2350 చదరపు అడుగుల నుంచి 2500 చదరపు అడుగుల మధ్యలో 3 బీహెచ్ కే, 2900 చదరపు అడుగుల పరిమాణంలో 4 బీహెచ్ కే ప్రీమియం, 3350 చదరపు అడుగుల్లో 4 బీహెచ్ కే లగ్జరీ ఫ్లాట్లు రూపొందించారు. అంతస్తుకు 10 యూనిట్ల చొప్పున 440 యూనిట్లు ఉంటాయి.

వంద శాతం వాస్తుతో దీనిని నిర్మిస్తున్నారు. ప్రతి ఫ్లాట్ కు ప్రత్యేకమైన ప్రైవేట్ లాబీ ఉంటుంది. 10 హై స్పీడ్ లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. కిడ్స్ పూల్ తో పాటు సీనియర్ సిటిజన్ ఏరియా, క్లబ్ హౌస్, జాగింగ్ ట్రాక్, కిడ్స్ ప్లే ఏరియా, స్విమింగ్ పూల్, లేక్, స్క్వాష్ కోర్టు, ఫిట్నెస్ సెంటర్ వంటి పలు సౌక్యాలు ఉన్నాయి. సౌకర్యం, చక్కదనాన్ని కోరుకునే కొనుగోలుదారులకు ఇది చక్కని ఎంపికగా ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా బుకింగ్ విలువ రూ.1300 కోట్లుగా ఉంది. ఫ్లాట్ల ధరలు రూ.2.63 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.

spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles