poulomi avante poulomi avante

ప్ర‌పంచ టాప్ 35 న‌గ‌రాల్లో హైద‌రాబాద్‌!

తెలంగాణలో పట్టణ జనాభా అంతకంతకు పెరిగిపోతోంది. అందులోనూ దేశంలోని అన్ని నగరాలకంటే మన హైదరాబాద్ లో అధికంగా జనం నిండిపోతున్నారు. 2025 చివరి నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన టాప్ 35 నగరాల్లో భాగ్యనగరం చేరిపోతుందని రెండేళ్ల క్రితమే నేషనల్ పాపులేషన్ రిపోర్ట్ అంచనా వేసింది. దీంతో రానున్న రోజుల్లో హైదరాబాద్ లో ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడనుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ కు అనుగునంగా గృహాల ధరలు పెరగనున్న నేపథ్యంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటిని కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

ప్రపంచంలో పట్టణ, నగర జానాభా విపరీకతంగా పెరుగుతోంది. విద్యా, ఉగ్యోగం, ఉపాధి అవకాశాల కోసం జనం పల్లెలు, గ్రామాలను వదిలి పట్టాణాలకు, నగరాలకు చేరుతున్నారు. దీంతో పల్లెలు ఖాళీ అవుతుండగా పట్టాణాలు నిండుకుంటున్నాయి. ఈ క్రమంలో మన దేశంలో, అందులోనూ తెలంగాణలో పట్టణ, నగర జనాభా అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం మన దేశ జనాభాలో 35.1 శాతం పట్టణ, నగర జనాభా ఉంటే, తెలంగాణలో ఇది 47.6 శాతంగా నమోదైంది. 2036 నాటికి అర్బన్‌ జనాభా జాతీయ స్థాయిలో 39.1 శాతానికి చేరితే, తెలంగాణలో 57.3 శాతానికి పెరుగుతుందని నేషనల్ పాపులేషన్ రిపోర్ట్ 2023 రెండేళ్ల క్రితమే అంచనా వేసింది. తెలంగాణలో అర్బన్‌ జనాభా దేశంలోనే అత్యధికంగా 18 శాతం పెరుగుతుందని స్పష్టం చేసింది. తెలంగాణలో 2014లో అర్బన్‌ పాపులేషన్‌ 39 శాతం కాగా, 2023 చివరి నాటికి 47.61శాతానికి పెరిగింది. ఇక ఈ యేడాది 2025 నాటికి తెలంగాణలో అర్బన్ పాపులేషన్ 50 శాతానికి చేరుతుందని అంటున్నారు.

తెలంగాణలో పట్టణ, నగర జనాభా శాతం ప్రతి సంవత్సరం పెరిగిపోతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ యేడాది చివరి నాటికి తెలంగాణ జనాభాలో సగానికి పైగా పట్టణాలు, నగరాల్లోనే ఉంటారని అంచనా వేస్తున్నారు. అర్బన్‌ జనాభా శాతం జాతీయ సగటు కంటే తెలంగాణలో 12 శాతం అధికంగా ఉంది. గత పదకొండేళ్లలో ఏకంగా 8.61 శాతం జనం పల్లెలను వదిలి పట్టణాలకు చేరారు. ఇది ఈ యేడాది చివరి నాటికి మరింత పెరుగుతుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌ నగరాల్లో జనాభా పెరుగుదల రేటు భారీగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ మహానగర జనాభా ఈ యేడాది చివరి నాటికి కోటికి మించిపోతుందనీ, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన టాప్‌ 35 మహా నగరాల జాబితాలో చేరుతుందని చెబుతున్నారు.

తెలంగాణ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాలు, పలు ఈశాన్య రాష్ట్రాల వారు కూడా ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఇలా వేగంగా జరుగుతున్న నగరీకరణకు అనుగునంగా హైదరాబాద్ లో మౌలిక సదుపాయాల కల్పనపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కోసం గత పదేళ్లలో 1.21 లక్షల కోట్లను ఖర్చుచేశారు. ఈ నిధులతో రహదారులు, ప్రజారవాణా, మంచినీరు, మురుగు నీటి శుద్ధి వంటి మౌలిక వసతులను అభివృద్ది చేశారు. ఐతే రానున్న రోజుల్లో హైదరాబాద్ లాంటి నగరాల్లో మౌలిక వసతులు మరింతగా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఇక పెరుగుతున్న హైదరాబాద్ జనాభాకు అనుగునంగా నివాస గృహాలకు భారీగా డిమాండ్ పెరగనుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో యేడాదికి ఇళ్ల అమ్మకాలు సుమారు 30 వేలు ఉండగా రానున్న రోజుల్లో క్రమంగా పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇళ్లకు ఏర్పడే డిమాండ్ మేరకు ధరలు కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉందని రియాల్టీ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న భూముల ధరలు, నిర్మాణ వ్యయం, కూలీల ఖర్చులు వంటివి పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్ లో వచ్చే రెండేళ్లలో గృహాల ధరలు ఊహించని రీతిలో పెరుగుతాయని అంటున్నారు. అందుకే హైదరాబాద్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్న వారు తమ తమ బడ్జెట్ కు అనుగునంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాలను మొదలుకొని ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఇంటి కొనుగోలు అవకాశాలను పరిశీలించుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles