Categories: LEGAL

ఏస్ గ్రూప్ పై ఐటీ దాడులు

ప్రముఖ నిర్మాణ సంస్థ ఏస్ గ్రూప్ పై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సంస్థకు చెందిన పలు కార్యాలయాలు, ఇళ్లలో పలుచోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. ఐటీ అధికారులకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని కంపెనీ సీఎండీ వెల్లడించారు. చట్టానికి అనుగుణంగానే అన్ని నియమ నిబంధనలకు లోబడి తాము పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఐటీ అధికారులు మూడు నెలలు క్రితం కూడా సోదాలు చేశారని, అప్పుడు కూడా తాము పూర్తిగా సహకరించామని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఏస్ గ్రూప్ పలు వాణిజ్య, నివాస ప్రాజెక్టుల్ని ఎన్ సీఆర్ రీజియన్లో అభివృద్ది చేసింది. కాగా, ఐటీ అధికారులు ఆగ్రాకు చెందిన షూ కంపెనీపై కూడా దాడులు చేశారు. ఆదాయ పన్ను ఎగవేశారనే ఆరోపణలపై ఈ రెండు కంపెనీల్లో తనిఖీలు చేశారు.

This website uses cookies.