poulomi avante poulomi avante

ఎస్‌ఎంఆర్ వినయ్ సిటీ అధ్యక్షుడిగా రెండోసారీ కింగ్ జాన్సన్ ఏక‌గ్రీవ ఎన్నిక‌

ఎస్‌ఎంఆర్ వినయ్ సిటీ అధ్యక్షుడిగా కింగ్ జాన్సన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మియాపూర్‌లోని ఎస్‌ఎంఆర్ వినయ్ సిటీ గేటెడ్ కమ్యూనిటీ (స్కోవా)లో గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా కింగ్ జాన్సన్ కొయ్యడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని స్కోవా ఎన్నికల సంఘం ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు జాన్సన్ మాట్లాడుతూ నాలుగేళ్ల నుంచి మెయింటనెన్స్ పెంచకుండా అభివృద్ధి పనులను చేపట్టడం వల్ల నివాసితులు తమపై పూర్తిగా నమ్మకం ఉంచారని ఆయన తెలిపారు.

ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా కమ్యూనిటీని తీర్చిదిద్దుతామన్నారు. కోశాధికారి ఎం. నవీన్ మాట్లాడుతూ రెసిడెంట్స్ తమ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చే రెండేళ్లు పలు అభివృద్ధి పనుల్ని చేపడతామన్నారు. నూతన కమిటీ సభ్యుల వివరాలు ఇలా… అధ్యక్షుడిగా కింగ్ జాన్సన్ కొయ్యడ, ఉపాధ్యక్షుడు హిమాన్షు, ప్రధాన కార్యదర్శిగా సురేష్, కార్యదర్శిగా సతీష్ వావ్ధానే, జాయింట్ సెక్రటరీగా దీపక్ ఖత్రీ, ట్రెజరర్‌గా ఎం నవీన్, జాయింట్ ట్రెజరర్‌గా అంకుర్ అగర్వాల్, ఇతర కమిటీ సభ్యులుగా సింధూరి, మధుమితా నాయక్, ధనుంజయ్ పాణిగ్రహీ, అర్దెందు శేఖర్‌దాస్, కె హిమబిందు, నితిన్ మిశ్రా, ఆనంద్ పాండే, సామ్యూల్ బీరాలు ఎన్నికయ్యారు.

 

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles