Categories: TOP STORIES

స‌మ్మిళిత వృద్ధికి.. సీఎం విజ‌న్ కార‌ణం!

  • గ‌త ఎనిమిదేండ్ల ఫ‌లితాలే సాక్ష్యం
  • ప‌రిష్క‌రించిన విద్యుత్తు స‌మ‌స్య‌
  • ఆనందంగా తెలంగాణ రైతులు
  • పెరిగిన ఐటీ ఎగుమ‌తులు
  • గూగుల్‌, మైక్రోసాఫ్ట్ పెట్టుబ‌డులు
  • న‌గ‌రానికి విదేశీ సంస్థ‌ల క్యూ..
  • ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు కాదు
    క‌మిట్‌మెంట్ ఉన్న లీడ‌ర్ కావాలి!
  • పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌ : భార‌త‌దేశంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రికీ సీఎం కేసీఆర్‌కు ఉన్నంత స‌మ్మిళ‌త‌మైన విజ‌న్ లేదని మంత్రి కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. క్రెడాయ్ హైద‌రాబాద్ ప్రాప‌ర్టీ షోలో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పేద‌వారి సంక్షేమం, అభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణం, ప‌రిశ్ర‌మ‌లు, వ్య‌వ‌సాయం, ఐటీ, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, ప‌ల్లె ప్ర‌గ‌తి.. వంటివ‌న్నీ ప‌క్కాగా.. ప్ర‌ణాళికాబ‌ద్ధంగా జ‌రుగుతుండ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు. అందుకే, హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని తెలిపారు. 2009లో సిరిసిల్ల వంటి ప్రాంతంలో ల‌క్ష రూపాయ‌లు విలువ చేయ‌ని భూమి విలువ‌ ఈరోజు గ‌ణ‌నీయంగా పెరిగింద‌న్నారు.

ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వ‌ర‌కూ ఎక్క‌డ చూసినా ఎకరం ధ‌ర ప‌దిహేను నుంచి 25 ల‌క్ష‌ల‌కు ఎక‌రా చెబుతున్నార‌ని వెల్ల‌డించారు. ఒక‌ప్పుడు నీళ్లు లేక‌, క‌రెంటురాక కునారిల్లిపోయిన రైతులు నేడు ధీమాగా ఉన్నార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం యొక్క స‌మ‌ర్థ‌త‌, ద‌క్ష‌త గ‌ల నాయకుడి విజ‌న్ వ‌ల్లే ఇది సాధ్య‌మైందని తెలిపారు. సాధార‌ణంగా ప్ర‌భుత్వం ఏదో ఒక‌ అంశం మీదే ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతుంద‌ని.. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు ఐటీ, బిజినెస్‌, ప‌రిశ్ర‌మ‌ల‌ మీద దృష్టి పెట్టేవారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎక్కువ‌గా వ్య‌వ‌సాయం, గ్రామీణ ప్రాంతాల‌ మీద దృష్టి పెట్టేవారు.

కానీ, ఇక్క‌డ కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌ట్ట‌ణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి ప‌రుగులు పెడుతోంద‌న్నారు. ఐటీ ఎగుమ‌తులు పెరుగుతున్నాయ‌ని, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు అధికం అవుతున్నాయ‌ని.. పారిశ్రామికీక‌ర‌ణ వేగంగా జ‌రుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స‌మ్మిళ‌త‌మైన, ఒక అరుదైన‌ అభివృద్ధి జ‌రుగుతోంద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. 230 కోట్ల మొక్క‌ల పెట్టి ఏడు శాతం గ్రీన్ క‌వ‌ర్ పెంచిన రాష్ట్రం మ‌న‌దని.. యునైటెడ్ నేష‌న్స్ హైద‌రాబాద్‌ని భార‌త‌దేశంలోనే ట్రీ సిటీగా వ‌రుస‌గా రెండుసార్లు గుర్తించింద‌ని గుర్తు చేశారు. ఇంకా, ఏమ‌న్నారో కేటీఆర్ మాట‌ల్లోనే..

లీడ‌రుకు క‌మిట్‌మెంట్ ఉండాలి!

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డే నాటికి విద్యుత్తు సామ‌ర్థ్యం 7600 మెగావాట్లు ఉంటే, డిమాండ్ 9వేల మెగా వాట్లు ఉండేది. విద్యుత్తు సంక్షోభంతోనే తెలంగాణ ప్ర‌యాణం ఆరంభ‌మైంద‌న్నారు. 25 ల‌క్ష‌ల బోర్ వెల్స్ టూబ్ వెల్స్ ఉండేవి. వాటికి క‌రెంటు రాదు. నీళ్లు రాదు, సిరిసిల్ల‌లో 800 ఫీట్లు కొట్టినా నీళ్లు వ‌చ్చేవి కావు. తెలంగాణ‌లో ఏడు మండ‌లాల్ని ప‌క్క‌న రాష్ట్రంలో క‌లిపేశారు. ప‌వ‌ర్ జెన‌రేష‌న్ స్టేష‌న్ కూడా పోయింది. కేసీఆర్ స‌మ‌ర్థ‌త‌, ద‌క్ష‌త వ‌ల్ల సుమారు ఆరు నెల‌ల్లోపే విద్యుత్తు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. రైతుల‌కు 24 గంట‌లు ఉచితంగా విద్యుత్తును అంద‌జేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను. గృహాల‌కే కాదు ప‌రిశ్ర‌మ‌ల‌కూ నాణ్య‌మైన క‌రెంటును అంద‌జేస్తున్నాం.
7000 వేల నుంచి ఇప్పుడు విద్యుత్తు సామ‌ర్థ్యం ప‌ద‌హారు వేల మెగావాట్ల‌కు ఎలా చేరింది. 2025క‌ల్లా 26 వేల మెగా వాట్ల‌కు చేరుకుంటాం. ఇదెలా సాధ్య‌మైంది? లీడ‌రుకు క‌మిట్‌మెంట్ ఉండాలి. డైలాగు కొట్టి ఛూమంత‌ర్ అంటే అయిపోదు. అల్లావుద్దీన్ అద్భుత దీపం, మంత్ర‌దండాలు ఎవ‌రి వ‌ద్ద ఉండ‌వు. ప‌ని చేయాలి. ఒళ్లు వంచాలి. బుర్ర పెట్టాలి. దానికి రిసోర్స్ అన్నీ కూడ‌గ‌ట్టాలి. అప్పుడే ప‌న‌వుతుంది. అదే కేసీఆర్ చేశారు. విజయం సాధించారు.

ప్రాడ‌క్టీవ్ ఎక్స్‌పెండీచ‌ర్ వ‌ల్ల లాభ‌మే..

తెలంగాణలో ఎక్క‌డ చూసినా భూముల ధ‌ర‌లు పెరిగాయి. వ్య‌వ‌సాయం 119 శాతం విస్త‌రించింది. ఎక్క‌డో మేడిగ‌డ్డ వ‌ద్ద గోదావ‌రి నీటిని ఒడిసిప‌ట్టుకుని కొండ‌పోచమ్మ సాగ‌ర్ వ‌ద్ద‌కు తెచ్చాం. కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వ‌రం మీద ఖ‌ర్చు పెట్టారు. కొత్త‌గా 45 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లొచ్చింది. రెండు పంట‌లంటే 90 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు నీళ్లు వ‌చ్చాయి. దాన్ని వ‌ల్ల సంప‌ద సృష్టించ‌బ‌డుతుంది. మ‌ళ్లీ ఆ సంప‌ద‌, ఈ రాష్ట్రంలోనే విద్య‌, వైద్యం, ఇల్లు కొనుక్కోవ‌డం మీదే పెడ‌తారు క‌దా.. ఇక్క‌డ రైతు బాగుప‌డితే, రైతు చేతికి పైస‌లొస్తే.. రాష్ట్రంలో సంప‌ద పున‌రుత్ప‌త్తి అవుతుంది క‌దా. అప్పు తీసుకుని కేసీఆర్ ఎక్క‌డ ఖ‌ర్చు పెట్టారు? విద్యుత్తు మీద పెట్టారు. ఎట్ల సాల్వ్ అయ్యింది క‌రెంట్ క్రైసిస్‌. అర‌వై ఏళ్ల‌లో
సాధ్యం కానిది ఆరు నెల‌ల్లో ఎలా సాధ్య‌మైంది? స‌బ్ స్టేష‌న్లు, లైన్లు వేశాం. విద్యుత్తు ఇన్‌ఫ్రాను డెవ‌ల‌ప్ చేశాం. అది ప్రాడ‌క్టీవ్ ఎక్స‌పెండీచ‌ర్‌. మ‌న‌కే లాభం క‌దా..

లివ‌రేజింగ్ ఎకాన‌మీ..

మొన్న మ‌హేశ్వ‌రం విప్రో ఛైర్మ‌న్ అజీమ్ ప్రేమ్‌జీ వ‌చ్చారు. ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప‌రిశ్ర‌మ‌.. మూడు షిఫ్టుల చొప్పున ప‌ని చేస్తున్నారు. ఎక్కువ‌గా స్థానిక అమ్మాయిలే ప‌ని చేస్తున్నారు. విద్యుత్తు వ‌స్తే ప‌రిశ్ర‌మ‌లు న‌డుస్త‌య్‌, ఇళ్ల‌ల్లో విద్యుత్తు స‌మ‌స్య ఉండ‌దు. సంప‌ద పున‌రుత్ప‌త్తి అవుతుంది. కేసీఆర్ అప్పు తీసుకుని మంచినీటి మీద పెట్టారు. తాగునీరు ల‌భిస్తే.. వాట‌ర్ బార్న్ డిసీజెస్ త‌గ్గుతాయ్‌. ఆరోగ్యం మీద ప్ర‌జ‌ల ఖ‌ర్చు త‌గ్గుతుంది. పెట్టిన ప్ర‌తిపైసా మ‌ళ్లీ మ‌రోపైసాను సృష్టిస్తుంటే.. అది అప్పు కాదు. పెట్టుబ‌డి. తెలివైన వారు చేసే ప‌ని ఇదే. మ‌న భ‌విష్య‌త్తు త‌రాల మీద పెట్టే పెట్టుబ‌డిని అప్పు కాద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. దీన్నే లివ‌రేజింగ్ ఎకాన‌మీ అంటారు. దీన్ని ప్ర‌తి దేశం చేస్తుంది. అప్పు చేసి సంప‌ద‌ను పున‌రుత్ప‌త్తి చేయ‌డం త‌ప్పెలా అవుతుంది? ఇంటింటికి తాగునీరు ఇవ్వాలనే ఆలోచ‌న కేసీఆర్ కు రానంత వ‌ర‌కూ ఇత‌ర ముఖ్య‌మంత్రుల‌కు ఎందుకు రాలేదు? ఏ ప్ర‌ధాన‌మంత్రికి ఎందుకు రాలేదు? రైతుకు పెట్టుబ‌డి పెట్టాల‌ని ఎందుకు ఆలోచ‌న రాలేదు?

వ్య‌వ‌సాయ రంగం తర్వాత అత్య‌ధిక మందికి ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల్ని నిర్మాణ రంగ‌మే క‌ల్పిస్తుంద‌ని.. దేశ ఆర్థిక అభివృద్ధిలో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. భార‌త‌దేశంలో అధిక శాతం మంది ప్ర‌జ‌లు గ్రామీణ ప్రాంతాల్లో అయిన‌ప్ప‌టికీ, ఈ దేశాన్ని న‌డిపిస్తున్న ఆర్థిక చోద‌క శ‌క్తి మాత్రం న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్నుంచి పుట్టుకొచ్చిన నిర్మాణం వంటి రంగాలే. న‌గ‌రాల్లో పెరుగుతున్న జ‌నాభా, అవ‌కాశాల‌కు అనుగుణంగా మౌలిక స‌దుపాయాలు అభివృద్ధి చేసుకోక‌పోతే, ఒక దేశంగా విఫ‌ల‌మ‌వుతాం. హైదరాబాద్ కు ప్ర‌పంచ స్థాయి న‌గ‌రంగా ఎద‌గాల‌నే ఆకాంక్ష ఉంది. ఇక్క‌డ వైద్యం చేయించుకోవ‌డానికి సుమారు డెబ్బ‌య్ దేశాల ప్ర‌జ‌లు విచ్చేస్తున్నారు. హెల్త్ , ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా ఖ్యాతినార్జించింది. కొవిడ్ కోసం చ‌త్తీస్‌ఘ‌డ్‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర వంటి రాష్ట్రాలకు చెందిన ప్ర‌జ‌లు ఇక్క‌డే చికిత్స నిమిత్తం విచ్చేశారు.

మోడీకి కేసీఆర్ ఆనాడే చెప్పారు

న‌గ‌రాల‌నేవి జాతీయ సంప‌ద‌.. వీటిలో త‌గిన సౌక‌ర్యాలు క‌ల్పించ‌క‌పోతే దేశానికి పెద్ద న‌ష్టం చేసిన‌ట్లు అవుతుంది. సీఎం కేసీఆర్ 2014లో ప్ర‌ధాన‌మంత్రిని క‌లిసిన‌ప్పుడు.. టాప్ 10 లేదా 15 న‌గ‌రాల్లో పెరిగే జ‌నాభా, వారి అవస‌రాల్ని దృష్టిలో పెట్టుకుని.. హైద‌రాబాద్, బెంగ‌ళూరు, చెన్నై వంటి మెట్రో న‌గ‌రాల్లో ఏటా రూ.10- 15 వేల కోట్లు అభివృద్ధి నిమిత్తం అంద‌జేయాల‌ని.. అప్పుడే దేశం ఆర్థికంగా ప‌రుగులు పెడుతుంద‌ని చెబితే ఆయ‌న పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. త‌ర్వాత వారు స్మార్ట్ సిటీస్‌, అమృత్ సిటీస్ అని ప్ర‌వేశ‌పెట్టారు. ఎవ‌రి విజ‌న్ వారిది, ఎవ‌రి ఆలోచ‌న వారిది.

ఒక పెద్దాయ‌న 2022 లోపు హౌసింగ్ ఫ‌ర్ ఆల్ అన్నారు. అంద‌మైన నినాదం.. చ‌క్క‌టి ఉద్దేశ్యం.. అయ్యిందా? జ‌రిగిందా? డైలాగుల‌తో ఏమ‌వుతుంది?ఊద‌ర‌గొట్ట‌డం.. పేప‌ర్లో క‌నిపించ‌డం.. ఊకదంపుడు ఉప‌న్యాసాలు. వీటితో అయిపోవు ప‌నులు. 2022 క‌ల్లా రైతుల ఆదాయం డ‌బుల్ అన్నారు. గుజ‌రాత్‌లో అయ్యిందా.. మ‌హారాష్ట్ర‌లో అయ్యిందా? ఏ ఊర్లో అయ్యిందో చూపెడ‌తో నేనూ చూస్తా? 2022 క‌ల్లా బుల్లెట్‌రైలు ఉరుకుత‌ది దేశంలో అన్నారు. ఏడ ఉరుకుతున్న‌య్ బుల్లెట్ రైళ్లు..? పంద్రా లాక్ దేతుం అన్నారు. నోటికి ఏదొస్తే అది చెప్పిండ్రు. కానీ, కేసీఆర్ మాత్రం అలా కాదు. చెప్ప‌క‌పోయినా ఎన్నో చేసి చూపెట్టిండు.
తెలంగాణ‌కు ఇన్వెస్ట‌ర్లు ఎవ‌రొచ్చిన ముందుగా ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగ‌ళూరు వెళ్లేసి.. చివ‌ర్లో హైద‌రాబాద్ ర‌మ్మ‌ని అంటాను. ఆయా న‌గ‌రాల్లో తిరిగిన త‌ర్వాత ఆటోమెటిగ్గా ఇక్క‌డే పెట్టుబ‌డి పెడ‌తామ‌ని అంటారు. ప‌క్క రాష్ట్రాల‌కు కారులో వెళితే.. అక్క‌డి మౌలిక స‌దుపాయాలు చూస్తే ఎవ‌రికైనా మ‌న హైద‌రాబాదే మెరుగ్గా ఉంటుంది. కొన్ని న‌గ‌రాల్లో బిల్డింగుకు ఇంత ఇస్తే త‌ప్ప అనుమ‌తులొచ్చే ప‌రిస్థితి ఉంటుంది. కానీ, మ‌న వ‌ద్ద లంచాలిచ్చి అనుమ‌తుల్ని ఇచ్చే ప‌రిస్థితి ఉందా? ఇంత పార‌ద‌ర్శ‌కంగా, ఇంత వేగంగా, ప్ర‌గ‌తీశీలంగా ఆలోచించే రాష్ట్రం, నాయ‌క‌త్వం ఎక్క‌డైనా ఉంటుందా?

ఎందుకిలా పురోగ‌మిస్తున్నామంటే?

  • తెలంగాణ వ‌చ్చిన తొలి రోజుల్లో.. త‌ల‌స‌రి ఆదాయం 1.24 ల‌క్ష‌లు మాత్ర‌మే. ఈ రోజు 2.78 ల‌క్ష‌లు. 130 శాతం పెరిగింది. ఇంత వేగంగా గ‌తంలో ఏ రాష్ట్రంలో పెరిగిన‌ట్లు చ‌రిత్ర‌లో లేదు.
  • తెలంగాణ వ‌చ్చిన నాటికి.. రాష్ట్ర జీఎస్‌డీపీ 5 ల‌క్ష‌ల కోట్లు. ఈ రోజు 11.55 ల‌క్ష‌ల కోట్లు. 130 శాతం పెరిగింది.
  • భౌగోళికంగా చూస్తే.. 28 రాష్ట్రాల్లో.. మ‌నం 11వ స్థానంలో ఉన్నాం.
  • జ‌నాభా ప‌రంగా చూస్తే 12వ స్థానం మ‌న‌ది.
  • ఆర్‌బీఐ రిపోర్టు ప్ర‌కారం.. భార‌త‌దేశ‌పు ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఆదాయాన్ని స‌మ‌కూర్చే రాష్ట్రాల్లో 4వ స్థానంలో ఉన్నాం. అంటే, మ‌న‌కంటే నాలుగు అతిపెద్ద రాష్ట్రాల కంటే మ‌న‌మే ఎక్కువ‌గా దేశ పురోగ‌మ‌నానికి తోడ్పాటును అందిస్తున్నాం.
  • 140 కోట్ల జ‌నాభ‌లో మ‌నం నాలుగు కోట్లు మాత్ర‌మే. కానీ, భార‌త‌దేశ‌పు జీడీపీలో మ‌న తెలంగాణ వాటా 5 శాతం.

This website uses cookies.