poulomi avante poulomi avante

హైదరాబాద్ మార్కెట్లోకి బే విండో

  • జూబ్లీహిల్స్‌లో మిడ్ లగ్జరీ ఫర్నిచర్
    ఫ్లాగ్ షిప్ స్టోర్ ప్రారంభం

కొత్త మిడ్ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్.. బే విండో హైదరాబాద్ మార్కెట్లో అడుగు పెట్టింది. జూబ్లీహిల్స్ లో 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తన మొదటి ఫ్లాగ్ షిప్ స్టోర్ ను ప్రారంభించింది. సిద్ధాంత్, శివానీ ఆనంద్ లు స్థాపించిన బే విండో.. విలాసవంతమైన ఫర్నిచర్ లో మూడు దశాబ్దాల నైపుణ్యం కలిగి ఉండటం విశేషం.

భారత ఉపఖండంలోని గృహాలంకరణలో తేడాలు తగ్గించే ఉద్దేశంతో, మీ ఇంటికి సరైన మిడ్ లగ్జరీ జీవనశైలి అందించే లక్ష్యంతో ఈ బ్రాండ్ కొనసాగుతోంది. నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా సౌందర్యవంతంగా ఈ ఫర్నిచర్ ఉత్పత్తులు ఉంటాయి. అంతర్జాతీయ డిజైనర్లతో భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల నుంచి ప్రేరణ పొందడం ద్వారా విభిన్నమైన గృహాలంకరణ ఉత్పత్తులు, ఫర్నిచర్ రూపొందిస్తున్నారు. ఈ ఉత్పత్తులు అటు అందంగా ఉండటమే కాకుండా ఇటు హస్తకళల ఉనికిని కూడా చాటతాయి. తద్వారా మీ ఇంటిని సౌకర్యవంతమైన స్టైలిష్ స్వర్గధామంగా మారుస్తాయి.

ఉదాహరణకు బైరాన్ బెడ్ సైడ్ టేబుల్ మీ బెడ్ రూమ్ డెకర్ కు మరింతగా సహజ సౌందర్యాన్ని జోడిస్తుంది. దీని సొగసైన డిజైన్, ఫంక్షనాలిటీ, సౌందర్యం రెండింటినీ మిళితం చేస్తుంది. శుభ్రం చేయడం కూడా తేలిక. దీని వెల రూ.18,600. అలాగే రెట్రో ప్రేరేపిత డిజైన్ సారాంశాన్ని సంగ్రహించి రూపొందించిన రిపోజ్ కాఫీ టేబుల్ తో సహజమైన అందాన్ని ఇస్తుంది. దీని ధర రూ.33,795. సటోరీ టేబుల్ ల్యాంప్ ధర రూ.6,990 కాగా, లోబీ ఏక్సెంట్ చైర్ ధర రూ.80,460గా ఉంది. అంకిమో రౌండ్ టేబుల్ రూ.42వేలకు లభిస్తుండగా.. లూనా టీవీ యూనిట్ ధర రూ.37,500. ‘రాబోయే మూడేళ్లలో పది నగరాల్లో ప్రవేశించాలని నిర్ణయించుకున్నాం. మెరుపువేగంతో డెలివరీ చేయడంతోపాటు సాటి లేని ఓమ్ని చానెల్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తాం’ అని సిద్దాంత్ ఆనంద్ పేర్కొన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles