Categories: LATEST UPDATES

ఏపీలోకి ఎంఎస్ఆర్డీబీ డెవలపర్స్

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంఎస్ రామయ్య డెవలపర్స్ అండ్ బిల్డర్స్ (ఎంఎస్ఆర్డీబీ) ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. తన కార్యకలాపాలను మూడు రాష్ట్రాల్లో విస్తరించేందుకు రూ.3వేల కోట్లు పెట్టుబుడి పెట్టాలని యోచిస్తోంది. ఈ మొత్తంతో ఏపీతోపాటు బెంగళూరు, గోవాల్లో రిటైల్, వాణిజ్య రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నాలుగున్న మిలియన్ల చదరపు అడుగుల్లో కార్యకలాపాలు చేస్తున్న ఈ సంస్థ.. వాటిని ఎనిమిది మిలియన్ చదరపు అడుగులకు రెట్టింపు చేయాలని భావిస్తోంది.

This website uses cookies.