Categories: TOP STORIES

నెబ్యూలా ఆవాస్‌పై రూ.2 లక్షల జరిమానా

కొనుగోలుదారుకు రిఫండ్ చెల్లించడంలో ఆలస్యమైనందుకు నెబ్యూలా ఆవాస్ కు రెరా రూ.2 లక్షల జరిమానా విధించింది. ఆవాస్ సంస్థ చేపట్టిన ఓ ప్రాజెక్టులో రామకృష్ణ అనే వ్యక్తి ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. ఇందుకోసం 2016 డిసెంబర్ నుంచి 2020 జూలై వరకు రూ.8,06,675 చెల్లించారు. అయితే, హోం లోన్ రావడం ఇబ్బందిగా మారడంతో 2021 జనవరిలో తన బుకింగ్ రద్దు చేసుకున్నారు.

అయితే, ఎన్నిసార్లు కోరినా బిల్డర్ ఆయనకు రూ.5,67,656 మాత్రమే చెల్లించారు. అది కూడా ఏడాదిన్నర తర్వాత ఇచ్చారు. దీనిపై ఆయన రెరాను ఆశ్రయించడంతో.. రిఫండ్ చేసిన మొత్తానికి వడ్డీ చెల్లించడంతోపాటు బుకింగ్ అమౌంట్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని వెంటనే వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.

This website uses cookies.