Categories: LATEST UPDATES

అమ్ముడైన ల‌క్ష యూనిట్లు!

2022లో హైద‌రాబాద్‌లో దాదాపు ల‌క్ష యూనిట్లు అమ్ముడ‌య్యాయ‌ని క్రెడాయ్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు రాజశేఖ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. న‌గ‌రంలో ఇళ్ల‌కు పెరుగుతున్న డిమాండుకు త‌గ్గ‌ట్టుగా బిల్డ‌ర్లు ఫ్లాట్ల‌ను నిర్మిస్తున్నార‌ని తెలిపారు. ఒక‌ప్పుడు ఏడాదికి మ‌హా అయితే 25 నుంచి 30 వేల ఫ్లాట్లు అమ్ముడ‌య్యేవ‌ని ఆయ‌న గుర్తు చేశారు. ప్ర‌స్తుతం ప్రాజెక్టుల సంఖ్య పెర‌గ‌డంతో పాటు అమ్మ‌కాలూ పెరిగాయ‌ని తెలిపారు.డెవ‌ల‌ప‌ర్ల ఆలోచ‌నా విధానంలో కూడా మార్పు వ‌చ్చింద‌న్నారు. ప్ర‌స్తుతం ఫేజుల వారీగా ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నార‌ని తెలిపారు. ఎన్నిక‌లొచ్చినా ఇళ్ల‌ను కొన‌డాన్ని ఎవ‌రూ వాయిదా వేయ‌ట్లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఫెస్టివ‌ల్ సీజ‌న్ కూడా కావ‌డంతో ఫ్లాట్ల‌ను కొనేవారి సంఖ్య ఎక్కువైంద‌ని తెలిపారు.

This website uses cookies.