Categories: TOP STORIES

ఒక్క ప్లాటు.. రూ.67.5 కోట్లు

బెంగళూరులో ఖరీదైన డీల్

బెంగళూరు కోరమంగళలో ఖరీదైన ప్రాపర్టీ డీల్ జరిగింది. బిలియనీర్ లేన్ గా పిలిచే కోరమంగళ థర్డ్ బ్లాక్ లో 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఓ స్థలాన్ని క్వెస్ కార్ప్ ఎండీ అజిత్ ఇసాక్ రూ.67.5 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. బెంగళూరులో ఇది ఖరీదైన డీల్ అని పేర్కొంటున్నారు. అరవింద్ రెడ్డి, గీతారెడ్డికి చెందిన ఈ ప్రాపర్టీని ఇసాక్ కొనుగోలు చేశారని, గతవారం ఈ డీల్ పూర్తయిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

పెట్టుబడికోణంలో ఈ ప్రాపర్టీని కొనుగోలు చేశారా లేక రీ డెవలప్ మెంట్ కోసమే అనేదానిపై స్పష్టత లేదు. కాగా, ఈ లావాదేవీలో చదరపు అడుగు ధర రూ.70,300 పలికి బెంగళూరు మార్కెట్ సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. గతంలో టీవీఎస్ మోటార్ ఇదే లైన్లో చదరపు అడుగు రూ.68వేలు వెచ్చించి కొన్న స్థలమే ఇప్పటివరకు ఖరీదైన డీల్. ఇదే ప్రాంతంలో 2019లో ఫ్లిఫ్ కార్ట్ కో ఫౌండర్ సచిన్ బన్సల్ రూ.45 కోట్లు వెచ్చించి ప్రాపర్టీ కొన్నారు

This website uses cookies.