Categories: TOP STORIES

రూ.107 కోట్లతో ఫ్లాట్ కొనుగోలు

ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న
లాయిడ్స్ ప్రమోటర్ కుటుంబం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో ఖరీదైన లావాదేవీ జరిగింది. లాయిడ్స్ గ్రూప్ ప్రమోటర్ ముఖేష్ గుప్తా భార్య అభా గుప్తా, కుమారుడు శ్రీకృష్ణ గుప్తాలు ముంబైలోని ఖరీదైన వర్లీ ప్రాంతంలో రూ.107 కోట్లు వెచ్చించి సీ వ్యూ లగ్జరీ అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. డాక్టర్ అనిబీ సెంట్ రోడ్డులో ఉన్న సూపర్ ప్రీమియం టవర్ సుగీ సీ క్రెస్ట్ లో ఈ కొనుగోలు జరిగింది. 25, 26, 27 అంతస్తుల్లో ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ 13,207 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. చదరపు అడుగు రూ.81,133 చొప్పున ధర పలికింది. ప్రాజెక్టు డెవలపర్ సుగీ డెవలపర్స్ నుంచి నేరుగా ఈ ఫ్లాట్ కొనుగోలు చేశారు.

This website uses cookies.