ఆర్ఈజీ న్యూస్, హైదరాబాద్, జూన్ 16: రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ప్రొవిన్షియా ప్రాజెక్టులోని క్లబ్ ఒడిస్సీ పేరిట ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల్ని అందజేసిందని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. ఆయన సోమవారం రాజపుష్ప ప్రాపర్టీస్ అభివృద్ధి చేసిన క్లబ్ ఒడిస్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చురుకైన ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించేందుకు క్లబ్ ఒడిస్సీని అభివృద్ధి చేసిందన్నారు. ఒక కమ్యూనిటీని ఎలా అభివృద్ధి చేయాలో రాజపుష్ప సంస్థ ఒక మార్గదర్శకాన్ని రూపొందించిందన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “క్లబ్ ఒడిస్సీతో సంప్రదాయ రియల్ ఎస్టేట్కు మించి ఒక శక్తివంతమైన జీవనశైలి వ్యవస్థను సృష్టించామని తెలిపారు. ఇది కేవలం ఇళ్లను నిర్మించడమే కాకుండా, ఆరోగ్యం, అనుబంధాలు, మరియు రోజువారీ ఆనందాన్ని పెంపొందించే అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీలను నిర్మించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. ప్రావిన్షియా అనేది భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే, ప్రీమియం జీవనం పట్ల మా విజన్ – ఇది ఇప్పుడు నిజమైంది” అని వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుజిత్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వంశీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#Hyderabad’s Largest Club House