హైదరాబాద్, జూన్ 16: భారతదేశానికి మెరికల్లాంటి క్రీడాకారుల్ని అందించేందుకు విశేషంగా కృషి చేస్తున్న నగరానికి చెందిన నిర్మాణ సంస్థ అయిన ఆర్క్ గ్రూప్.. మరో కొత్త విభాగానికి తాజాగా శ్రీకారం చుట్టింది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సివిల్ సర్వీసెస్ అధికారుల్ని అందించాలన్న ఉన్నత లక్ష్యంతో.. హైదరాబాద్లో ఆర్క్ రిఫ్లెక్షన్స్ అనే కోచింగ్ సెంటర్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు పుల్లెల గోపిచంద్ హాజరయ్యారు. సంస్థ లక్ష్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. “క్రీడలు లేదా పౌర సేవలు ఏ రంగంలో అయినా విజయం అనేది స్పష్టత, క్రమశిక్షణ మరియు మార్గదర్శకత్వం నుండి వస్తుంది. ఏఆర్ కె రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ ఈ విలువలను ప్రతిబింబించే వేదికను నిర్మిస్తోంది. లక్ష్యం మరియు సమగ్రతతో దేశానికి సేవ చేయడానికి యువతను శక్తివంతం చేస్తుంది” అని అన్నారు.
ఈ సందర్భంగా ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి మాట్లాడుతూ.. సంస్థ లక్ష్యంపై తన సంతోషం మరియు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఏఆర్ కె వద్ద , ప్రభావాన్ని సృష్టించే సంస్థలను నిర్మించడంను తాము నమ్ముతామని అన్నారు. ఈ కొత్త కేంద్రంతో, మౌలిక సదుపాయాలను విస్తరించటం కాదు – మా వద్దకు వచ్చే ప్రతి ఆశావాహునికి అందుబాటులో ఉంటూనే అవకాశం మరియు ఉద్దేశ్యాన్ని విస్తరిస్తున్నామ” ని అన్నారు.
ALSO READ: Skycrapers in Hyderabad సెంట్రల్లో స్కై స్క్రేపర్లు
ఏఆర్ కె రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ డైరెక్టర్ డాక్టర్ వివేకానంద మాట్లాడుతూ, “ఈ కొత్త కేంద్రం వ్యక్తిగతీకరించిన మార్గదర్శకత్వం మరియు సమగ్ర శిక్షణ పట్ల మా నిబద్ధతకు సహజమైన కొనసాగింపు. మేము కేవలం ఒక సంస్థగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి విజయ ప్రయాణంలో తోడుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాము” అని అన్నారు.
విద్యా పరంగా అత్యున్నతమైన ప్రాంతంగా వెలుగొందుతున్న అశోక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త కేంద్రం – ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్ ) మరియు ఇతర ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసుల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులలో అధిక-నాణ్యత కలిగిన కోచింగ్ కోసం పెరుగుతున్న డిమాండ్ అవసరాలను తీర్చడానికి వ్యూహాత్మకంగా ప్రారంభించారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో మరియు అనుభవజ్ఞులైన విద్యావేత్తల బృందం మద్దతుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం సివిల్ సర్వీసెస్ శిక్షణ పరంగా ప్రముఖ కేంద్రంగా అవతరించడానికి సిద్ధంగా ఉంది.