Categories: LATEST UPDATES

మై హోమ్ అవతార్ అధ్యక్షుడిగా రవీంద్ర ఛారీ ఎన్నిక

మై హోమ్ అవతార్ నివాసితుల సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నివాసితులంతా కలిసి కొత్త అధ్యక్షుడిగా ఏ. రవీంద్ర ఛారీ ని ఎన్నుకున్నారు. లెక్చరర్గా పదవీవిరమణ చేసిన ఆయనతో పాటు కొత్త సంఘం రెండేళ్ల పాటు మై హోమ్ అవతావర్ నిర్వహణ బాధ్యతల్ని చేపడతారు. దాదాపు మూడు వేల ఫ్లాట్లు గల మై హోమ్ అవతార్ సంఘంలో సుమారు 12 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రవీంద్ర ఛారీ మాట్లాడుతూ.. నివాసితులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తామ‌న్నారు. రెసిడెంట్స్ కు ఎలాంటి ఇబ్బందులు రానీయ‌కుండా త‌మ సంఘం ప‌ని చేస్తుంద‌న్నారు. ఎన్నికైన కొత్త కమిటీ సంఘం సభ్యులిలా ఉన్నారు.

డీకే కార్వా: ఉపాధ్యక్షుడు
కాజు రాజేందర్: ప్రధాన కార్యదర్శి
రోహిత్ బాబు: జాయింట్ సెక్రటరీ
నాగేంద్ర కుమార్: ట్రెజరర్
హరి సూర్య: జాయింట్ ట్రెజరర్
శుభం శ్రీవాస్తవ: ఈసీ మెంబర్
సాధనా సింగ్: ఈసీ మెంబర్
మైధిలీ: ఈసీ మెంబర్
అజిత్: ఈసీ మెంబర్

This website uses cookies.