Categories: Rera

రూ.1200 కోట్ల రికవరీ సర్టిఫికెట్లకు పరిష్కారం

2018 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.1200 కోట్ల విలువైన రికవరీ సర్టిఫికెట్లను పరిష్కరించినట్టు యూపీ రెరా చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు. బిల్డర్లు, కొనుగోలుదారుల పరస్పర అంగీకారంతో వీటిని పరిష్కరించామని వెల్లడించారు. ఒక్క 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే రూ.394.26 కోట్ల విలువైన రికవరీ సర్టిఫికెట్లను పరిష్కరించామన్నారు. తన చివరి పనిదినం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రెరాల కంటే తామే అత్యధిక రికవరీ సర్టిఫికెట్లను పరిష్కరించామని పేర్కొన్నారు. అలాగే 1200కి పైగా కేసులను పరిష్కరించడం ద్వారా రూ.485 కోట్ల విలువైన ప్రాపర్టీలపై వివాదం లేకుండా చేసినట్టు తెలిపారు.

This website uses cookies.