poulomi avante poulomi avante

ఇళ్ల ధరల్లో స్వల్ప పెరుగుదల

  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3 – 4 శాతంలోపే పెరిగే అవకాశం
  • ఇండియా రేటింగ్స్ నివేదిక అంచనా

దేశవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల ధరలు 3 శాతం నుంచి 4 శాతం లోపు పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ నివేదిక అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇళ్ల ధరల పెరుగుదల కాస్త తగ్గనుంది. అధిక బేస్ ఎఫెక్ట్, కొత్త లాంచ్ ల కారణంగా 2024-25లో ప్రాపర్టీ ధరలు ఏడాదికి 5 శాతం 6 శాతానికి పెరుగుతాయని అంచనా వేసిన ఇండియా రేటింగ్స్.. 2025-26లో 3 నుంచి 4 శాతం మధ్యలో పెరుగుతాయని పేర్కొంది. 2023-24లో ధరలు 21 శాతం పెరిగాయని తెలిపింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ రంగం తటస్థంగా ఉంటుందని అభిప్రాయపడింది.

అధిక బేస్, అధిక ధరలు, లగ్జరీ విభాగంలో మందగమనం కారణంగా బుకింగ్‌లలో వృద్ధి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024-25లో బలమైన పనితీరును నమోదు చేస్తుందని అంచనా వేశారు. అమ్మకాల్లో విస్తీర్ణపరంగా 17 శాతం, యూనిట్ల పరంగా దాదాపు 15 శాతం అమ్మకాల వృద్ధి ఉంటుందని పేర్కొన్నారు. ఈ వృద్ధి ఎక్కువగా ప్రీమియం మరియు లగ్జరీ సెగ్మెంట్ విక్రయాల్లోనే ఉంటుందని అంచనా వేశారు. 2026 ఆర్థిక సంవత్సరంలో బుకింగ్‌లలో సానుకూల వృద్ధిని కొనసాగించే అవకాశం ఉందని నివేదిక ఇండియా రేటింగ్స్ డైరెక్టర్ మహావీర్ శంకర్ లాల్ జైన్ పేర్కొన్నారు.

spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles