poulomi avante poulomi avante

హైదరాబాద్ లో ‘స్మార్ట్ వర్స్క్’ దూకుడు

    • 4.5 లఓల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజ్

దేశంలో భారీగా రియల్ ఎస్టేట్ లీజు వ్యవహారాలు చూస్తున్న స్మార్ట్ వర్క్స్ సంస్థ హైదరాబాద్ లో దూకుడు పెంచింది. తాజాగా మన నగరంలో 4.5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకుంది. రహేజా కారొరేషన్ కు చెందిన మైండ్ స్పేస్ ఐటీ పార్కులో ఉన్న ఈ స్పేస్ ను ఐదేళ్ల లాకింగ్ పిరియడ్ తో లీజు ఒప్పందం చేసుకుంది. ‘ఈ ఒప్పందం గత త్రైమాసికంలో పూర్తయింది. 2022 తొలి త్రైమాసికంలో అక్కడ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆఫీస్ స్థలం కోసం డిమాండ్ పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లు సేకరించే పనిలో స్మార్ట్ వర్క్స్ సంస్థ నిమగ్నమైంది. 2021లో దాదాపు పది లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ సమీకరించిన ఈ సంస్థ.. 2022లో దీనిని రెట్టింపు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం మైండ్ స్పేస్ లో లీజుకు తీసుకున్న స్థలంలో దాదాపు 4వేల మంది పనిచేసుకునేందుకు సరిపోతుంది. ఇంతకుముందు ఈ సంస్థ పుణెలోని బేనర్ ప్రాంతంలో 5.6 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు తీసుకుంది. ప్రస్తుతం స్మార్ట్ వర్క్స్ సంస్థ దేశవ్యాప్తంగా తొమ్మిది నగరాల్లోని 32 ప్రాంతాల్లో 50 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ కలిగి ఉంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles