Categories: LATEST UPDATES

యూకే సంస్థ ’సిట్కో‘ కొత్త ఆఫీసు

యూకేకి చెందిన ’సిట్కో‘ సంస్థ హైదరాబాద్లో కొత్త ఆఫీసు సముదాయాన్ని తీసుకుంది. ప్రస్తుతం హైటెక్ సిటీలో కార్యకలాపాల్ని నిర్వహిస్తున్న ఈ కంపెనీ 2022 మూడో త్రైమాసికంలో సాలర్ పురియా సత్వా నాలెడ్జి సిటీలోకి అడుగుపెట్టనుంది. దాదాపు 1200 మంది ఉద్యోగుల్ని వచ్చే రెండేళ్లలో తీసుకోవాలని సంస్థ ప్రణాళికల్ని రచిస్తోంది. హైదరాబాద్ నుంచి ఫండ్ సర్వీస్, బ్యాంకింగ్, టెక్నాలజీ సపోర్టు వంటి సేవల్ని అంతర్జాతీయ క్లయింట్లకు అందజేస్తుంది. ఈ సందర్భంగా సిట్కో ఇండియా జనరల్ మేనేజర్ అమిత్ వర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్ టెక్నాలజీ హబ్ గా అవతరించిందని.. దీనికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ 40 దేశాల్లో సేవల్ని అందిస్తోంది. సుమారు 9000 మంది సిబ్బంది పని చేస్తున్నారు.

This website uses cookies.