Categories: TOP STORIES

ముంబై, చెన్నైలోకి.. వాస‌వి గ్రూప్

హైద‌రాబాద్‌కు చెందిన వాస‌వి గ్రూప్ న‌గ‌రం నాలుగువైపులా నిర్మాణాల్ని చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా కొంప‌ల్లిలో వాస‌వి ఆవాసాతో మ‌రో బ‌హుళ అంత‌స్తుల ప్రాజెక్టుని ఇటీవ‌ల అట్ట‌హాసంగా ఆరంభించింది. అది కూడా ప్ర‌ముఖ సినీ న‌టుడు వెంక‌టేష్ చేతుల మీదుగా ఈ రెండు ప్రాజెక్టుల బ్రోచ‌ర్ల ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. ఆ స‌మావేశంలో విక్ట‌రీ వెంక‌టేష్ ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు. సంస్థ ఎండీ విజ‌య్ కుమార్‌ని పొగ‌డ్త‌ల‌తో నింపేశారు. ఈ క్ర‌మంలో వాస‌వి గ్రూప్ కు సంబంధించిన ఒక కొత్త అప్‌డేట్ రియ‌ల్ ఎస్టేట్ గురు తెలిసింది. అదేమిటంటే.. వాస‌వి గ్రూప్ ముంబైలో మూడు ప్రాజెక్టులు, చెన్నైలో ఒక ప్రాజెక్టును ఆరంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తోంద‌ని స‌మాచారం. ఇందుకు సంబంధించిన డిజైనింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని.. ఆర్కిటెక్టులు ప్ర‌ణాళిక‌ల్ని రూపొందిస్తున్నార‌ని తెలిసింది. అంతా స‌వ్యంగా సాగితే, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ముంబై. చెన్నైలో వాస‌వి గ్రూప్ కొత్త ప్రాజెక్టుల్ని ప్రారంభించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.

బెంగ‌ళూరులోకి పౌలోమీ…

న‌గ‌రానికి చెందిన పౌలోమీ సంస్థ బెంగ‌ళూరులో అడుగుపెట్ట‌డానికి సిద్ధమైంది. ఈ కంపెనీ ఇప్ప‌టికే బెంగ‌ళూరులోని ఒక ప్రైమ్ లొకేష‌న్‌లో ప‌ది ఎక‌రాల స్థ‌లాన్ని కొనుగోలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల జ‌ర‌గ‌క ముందే ఈ విష‌యాన్ని స‌ద‌రు కంపెనీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత అక్క‌డ ప్రాజెక్టును ఆరంభించే అవ‌కాశ‌మున్న‌ద‌ని స‌మాచారం.

This website uses cookies.